ముఖ్యంగా మొఘల్ పాలకులకు కళలు, కళాకారులు అంటే ఎంతో ఇష్టం. షాజహాన్ కాలంలోనే తాజ్ మహల్ తో పాటు ఎర్రకోట, జామా మసీదు వంటి అద్భుత కట్టడాలు కూడా నిర్మాణం సాగాయి. అందులో కూడా నిపుణులు, శిల్పులు ఎంతో కాలం పనిచేశారు. ఒకవేళ నిజంగానే తాజ్ మహల్ కట్టిన తర్వాత కూలీల చేతులు నరికేసి ఉంటే.. మరి ఎర్రకోట, జామా మసీదు వంటి గొప్ప నిర్మాణాలు కట్టేందుకు మళ్లీ కూలీలు ఎలా దొరికి ఉంటారు? అనే ప్రశ్న కూడా ఉంది. ఆధారాలు చెబుతున్న ప్రకారం శిల్పులకు మంచి జీతాలు, సౌకర్యాలు షాజహాన్ కల్పించినట్టు చారిత్రకారులు చెబుతున్నారు.