ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం… ఇండియాలో సుమారు 110 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది.
హిందూ జనాభాలో మన పొరుగుదేశం నేపాల్ రెండో స్థానంలో ఉంది. కొన్ని గణాంకాల ప్రకారం నేపాల్లో సుమారు 2.86 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్నది ఈ రెండు దేశాల్లోనే అని చాలామందికి తెలుసు. మరి వీటి తర్వాతి స్థానాల్లో ఏయే దేశాలు ఉన్నాయో చూద్దాం.
బంగ్లాదేశ్
హిందువులు అధికంగా గల దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. డేటా ప్రకారం, ఇక్కడ సుమారు 1.38 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి.
ఇండోనేషియా
ఇండోనేషియాలో దాదాపు 42 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద హిందూ జనాభా ఉన్న దేశం. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ, ఇక్కడ హిందూ మతం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా బాలి ద్వీపం హిందూ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.