కొంతమంది చరిత్రకారుల మాటల్లో రామాయణ కాలాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. రామాయణం తిరుగులేని ఇతిహాసం. పురాణాల్లో చెప్పిన ప్రకారం లంకా నగరం బంగారంతో నిర్మించారు. కానీ అలాంటి నగరానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఏవీ శ్రీలంకలో లభించలేదు. లంకా అనే పేరు ఒకే ప్రాంతానికి చెందినది కాదు. దక్షిణ భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలకు లంక అనే పేర్లు ఉన్నాయి. రామాయణంలోని లంక ఈనాటి శ్రీలంక ఒక్కటే అని కచ్చితంగా చెప్పలేమని కొంతమంది చారిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రీయంగా చెప్పుకుంటే ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రామసేతు సహజంగా ఏర్పడిన ఒక ఇసుక దిబ్బల శ్రేణి అని అంటారు. ఉపగ్రహ చిత్రాలు ఆధారంగా చూసుకుంటే వేల ఏళ్ల క్రితమే ప్రకృతి వల్ల ఇది ఏర్పడ్డాయని అంటారు. కానీ మరోవైపు పురాణాల్లో మాత్రం వానరసైన్యంతో రాముడి కట్టాడని చెబుతారు. అయితే రామాయణం అనేది చరిత్రగా మిగిలిపోలేదు. ధర్మం, నైతిక విలువలను జీవన విధానాన్ని బోధించే మహా గ్రంధంగా వాడుకలో ఉంది. రావణుడి లంక దక్షిణ భారత తీర ప్రాంతానికి దగ్గరలో ఎక్కడో దగ్గర ఉంటుందని మాత్రం చారిత్రకారులు చెబుతున్నారు. రావణుడి లంక ఎక్కడ ఉందో చెప్పే ఖచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు.