Slowest Train: ఒక మనిషి గంటకు 8 నుంచి 9 కిలోమీటర్లు చాలా ఈజీగా నడిచేయగలడు. అలా మనిషి నడిచే వేగం కంటే తక్కువ వేగంతో నడిచే రైలు ఒకటి ఉందని మీకు తెలుసా? అది ఎక్కడానికి జనాలు క్యూలు కట్టేస్తుంటారు? ఏంటి ఆ రైలు స్పెషల్?
మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రైలు ఎక్కే ఉంటారు. రైలు ప్రయాణం కొన్ని గంటల పాటు, రోజుల పాటు సాగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కవ మంది రైలు జర్నీనే ఇష్టపడతారు. అయితే.. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణం చాలా సులువు అయ్యిందనే చెప్పాలి. అత్యంత వేగంగా నడిచే రైళ్లు చాలానే వచ్చాయి. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఒకటి ఉందని మీకు తెలుసా..? అంత నెమ్మదిగా నడిస్తే.. ఆ రైలు ఎవరు ఎక్కుతారు అని మాత్రం అనుకోకుండి.. ఈ రైలు ఎక్కడానికి రోజూ క్యూలు కట్టేవారు కూడా ఉన్నారు.. ఇంతకీ ఆ రైలు ఎక్కడ ఉంది? ఎక్కడ నుంచి ప్రయాణిస్తుంది? ఇంత నెమ్మదిగా వెళ్లడం వెనక కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
24
అద్భుతమైన రైలు ప్రయాణం..
ఈ రైలు చాలా నెమ్మదిగా వెళ్లినా.. ఇంకాస్త నెమ్మదిగా వెళితే బాగుండు అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే.. ఇది దట్టమైన అడవులు, పొగమంచుతో నిండిన కొండలు, చీకటిగా ఉండే సొరంగాలు, టీ తోటల మధ్యలో సాగుతుంది. ఈ రైలు ఎక్కినప్పుడు ఎంత సేపు కూర్చొన్నాం అనే భావన కంటే..ప్రకృతి మీద మాత్రమే దృష్టి ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది.
34
నీలగిరి పర్వాతాల మధ్య నడిచే రైలు...
ఈ రైలు మెట్టపళయం, ఊటీ మధ్య నీలగిరి కొండల మధ్య నడుస్తుంది. భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా కదిలే రైలుగా దీనికి గుర్తింపు ఉంది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. అంటే.. ఆ రైలు కంటే మనుషులే వేగంగా నడవగలరు. మొత్తం 46 కిలోమీటర్ల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అంటే మొత్తం ఐదు గంటల ప్రయాణం. అంత నెమ్మదిగా నడిచినా.. అత్యంత అందమైన ప్రయాణంగా.. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.
44
నెమ్మదిగా రైలు కదలడానికి కారణం ఏంటి..?
ఈ రైలు నీలగిరి పర్వాతాల మధ్య ప్రయాణిస్తుంది. కొండల నిటారు భాగం మీద రైలు కదులుతుంది. అందుకే... ఇతర ప్యాసింజర్ రైలు కన్నా తక్కువ వేగంతో ఈ రైలు కదులుతుంది. ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. భద్రతా కారణాల దృష్ట్యా నెమ్మదిగా కదులుతుంది. భద్రత కోసం నెమ్మదిగా కదిలినా.. చుట్టూ మనోహర దృశ్యాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సినిమా పాటల చిత్రీకరణ...
ఈ రైలులో కొన్ని సినిమా పాటలు కూడా చిత్రీకరించడం విశేషం. షారూఖ్ ఖాన్, మలైకా అరోరా కలిసి నటించిన దిల్ సే మూవీలో చయ్య చయ్య పాట కూడా ఈ రైలులోనే చిత్రీకరించారు.