ముంబైలో మాత్రమే కాదు ఢిల్లీలోని పురాతన ప్రాంతమైన చాందినీ చౌక్లో 'కూచా మహాజనీ' అనే మార్కెట్ ఉంది. ఇది ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్గా నిలిచింది. ఇక్కడ భారీ సైజు బ్రైడల్ జ్యువెలరీ, కుందన్ వర్క్, బంగారు బిస్కట్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కోల్కతాలోని 'బో బజార్', 'బుర్రా బజార్'లలో కూడా ఎన్నో రకాల బంగారు ఆభరణాలు లభిస్తాయి. తేలికపాటి బరువు ఉండే హ్యాండ్క్రాఫ్టెడ్ ఆభరణాలకు బాగా ఈ రెండు మార్కెట్లు చాలా పాపులర్. ఇక్కడ చేతివృత్తి కళాకారులు చేసే అత్యంత అరుదైన, ఆకర్షణీయమైన బెంగాలీ ఫిలిగ్రీ పనితనానికి మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు రాజస్థాన్లోని జైపూర్ 'జోహరీ బజార్' కూడా బంగారం కొంచెం తక్కువ ధరకే దొరికే మార్కెట్. సంప్రదాయ రాజస్థానీ కుందన్, మీనాకారి, పోల్కీ జ్యువెలరీ ఇక్కడ లభిస్తుంది.