Gandhi: బోయర్ వార్ (Boer War) అంటే ఏమిటి? ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటీ?

Published : Jul 03, 2026, 01:49 PM IST

Gandhi: హిస్టరీకి సాక్ష్యంగా నిలిచిన యుద్ధాలు చాలానే ఉన్నాయి. వాటిలో అత్యంత భయంకరమైనది, ఆధునిక యుద్ధ పద్ధతులకు పునాది వేసింది 'బోయర్ వార్' (Boer War). అప్పుడే మహాత్మా గాంధీకి 'కైజర్-ఇ-హింద్' మెడల్ ఇచ్చారు. మరి ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటి? 

PREV
16
గాంధీజీకి, బోయర్ యుద్ధానికి సంబంధం ఏంటీ?

బోయర్ వార్ లేదా 'ఆంగ్లో-బోయర్ యుద్ధం' 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం మొదట్లో బ్రిటీషులకు, దక్షిణాఫ్రికాలోని డచ్ సంతతికి చెందిన బోయర్లకు మధ్య జరిగిన ఈ సుదీర్ఘ పోరాటం ఇది.

అసలు 'బోయర్స్' అంటే ఎవరు?

17వ శతాబ్దంలో నెదర్లాండ్స్ (డచ్), జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి వలస వచ్చి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తెల్లవాళ్లను "బోయర్స్" అని పిలిచేవారు. డచ్ భాషలో 'బోయర్' అంటే 'రైతు'. వీరు క్రమంగా స్థానిక తెగలతో పోరాడి, దక్షిణాఫ్రికాలో 'ట్రాన్స్‌వాల్' 'ఆరెంజ్ ఫ్రీ స్టేట్' అనే రెండు దేశాలను స్థాపించుకున్నారు. వీరిని 'ఆఫ్రికానర్స్' అని కూడా పిలుస్తారు. 

26
యుద్ధానికి దారితీసిన కారణం

మొదట్లో బ్రిటీష్ రాజులు బోయర్ల జోలికి వెళ్లలేదు. కానీ 1860-1880ల మధ్య కాలంలో బ్రిటీషుల కన్ను దక్షిణాఫ్రికాపై పడింది. దానికి కారణం అక్కడ బయటపడ్డ అపారమైన సంపద. బోయర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల గనులు, బంగారు నిధులు గుర్తించారు.

బ్రిటీష్ సామ్రాజ్యానికి ఈ బంగారం, వజ్రాలను దక్కించుకోవాలనుకున్నారు. ఎలాగైనా ఆ ప్రాంతాలను తమ హస్తగతం చేసుకోవాలని బ్రిటీషర్లు కుట్రలు చేయడం, బోయర్లపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. తమ స్వేచ్ఛను, సంపదను కాపాడుకోవడానికి బోయర్లు ఎదురుతిరగడంతో యుద్ధం మొదలైంది. 

36
రెండు బోయర్ యుద్ధాలు

బ్రిటిషర్లకు, బోయర్లకు మధ్య రెండు విడతలుగా యుద్ధం జరిగింది. మొదటి బోయర్ వార్ (1880 - 1881). బ్రిటీష్ సైన్యం తక్కువ అంచనా వేసి బోయర్లపైకి వెళ్లింది. కానీ అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న బోయర్లు, గెరిల్లా యుద్ధ పద్ధతులతో బ్రిటీష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఈ మొదటి యుద్ధంలో బోయర్లు గెలిచారు.

రెండవ బోయర్ వార్ (1899 - 1902)లో జరిగింది. మొదటి ఓటమిని అవమానంగా భావించిన బ్రిటీష్ సామ్రాజ్యం, ఈసారి ప్రతీకారంతో రగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సైన్యాన్ని దాదాపు 5 లక్షల మందిని దక్షిణాఫ్రికాలో రంగంలోకి దించింది. బోయర్ల సైన్యం కేవలం 80 వేల లోపే ఉన్నప్పటికీ, ఆధునిక ఆయుధాలతో దాదాపు మూడేళ్ల పాటు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. 

46
బ్రిటీషర్ల 'స్కార్చ్డ్ ఎర్త్' పాలసీ & కాన్సంట్రేషన్ క్యాంపుల క్రూరత్వం

బోయర్ గెరిల్లా యోధులను నేరుగా యుద్ధంలో ఓడించలేకపోయిన బ్రిటీష్ సైన్యం, అత్యంత అమానవీయమైన 'స్కార్చ్డ్ ఎర్త్' విధానాన్ని అమలు చేసింది. బోయర్ సైనికులకు ఆహారం, ఆశ్రయం దక్కకుండా చేయడం కోసం వారి ఇళ్లను తగలబెట్టారు. పంట పొలాలను నాశనం చేసి, బావుల్లో విషం కలిపారు, లక్షలాది పశువులను చంపేశారు. అంతటితో ఆగక, బోయర్ మహిళలను, చిన్నారులను బంధించి 'కాన్సంట్రేషన్ క్యాంపుల' లో పడేశారు. ఈ క్యాంపుల్లో కనీస ఆహారం, తాగునీరు, వైద్యం అందక.. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడి దాదాపు 27,000 మంది బోయర్ మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

56
ఈ యుద్ధంలో మహాత్మా గాంధీ పాత్ర ఏంటి?

రెండవ బోయర్ యుద్ధం జరుగుతున్న సమయంలో (1899లో) మహాత్మా గాంధీ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించడానికి గాంధీజీ దాదాపు 1,100 మంది స్థానిక భారతీయులతో కలిసి 'ఇండియన్ అంబులెన్స్ కోర్ప్స్' ను స్థాపించారు.

ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో స్ట్రెచర్లపై గాయపడిన బ్రిటీష్ సైనికులను మోస్తూ, వారికి వైద్య సేవలు అందించారు. గాంధీజీ చేసిన ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు 'కైజర్-ఇ-హింద్' (Kaisar-i-Hind) పతకాన్ని బహూకరించింది. అయితే 'జలియన్ వాలాబాగ్' దురంతానికి నిరసనగా గాంధీజీ ఈ మెడల్‌ను బ్రిటీష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 

66
యుద్ధం ముగింపు

ఎంత పోరాడినప్పటికీ, బ్రిటీష్ సైన్య బలం ముందు బోయర్లు ఎక్కువ కాలం నిలవలేకపోయారు. మే 1902 లో జరిగిన 'ట్రీటీ ఆఫ్ వెరీనిగింగ్' ఒప్పందంతో ఈ సుదీర్ఘ రక్తపాతం ముగిసింది. బోయర్ రిపబ్లిక్‌లు తమ స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమయ్యాయి. ఆ తర్వాత 1910 లో ఈ ప్రాంతాలన్నీ కలిసి 'యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా' గా ఏర్పడ్డాయి. 

Read more Photos on
click me!

Recommended Stories