కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో యష్ రెమ్యూనరేషన్ రూ.50 కోట్లు. మహిళా పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో నయనతార, కియారా అద్వానీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.