ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటని చేసినప్పుడు జ్యోతి కృష్ణ కలిశాడని, ఆ టైమ్లో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట.
ఈ మూవీతో ఉదయ్ కిరణ్కి మంచి లైఫ్ వస్తుందని. కానీ ఏదో జరిగింది, ఉదయ్ కిరణ్ కి లైఫ్ని తలక్రిందులు చేసిందని జోస్యభట్ల వెల్లడించారు. ఈ మూవీ ఆగిపోవడం వెనుక కొన్ని పెద్దవారి హస్తం ఉండే ఉంటుందని, వాళ్లే తెరవెనుక కథ నడిపించినట్టుగా ప్రచారం జరుగుతుంది.