దీనిపై మోహన్ బాబు తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణు హీరోగా కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 140 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంటర్వ్యూలో మోహన్ బాబు మెగా ఫ్యామిలీతో విభేదాలు, ట్రోలింగ్ గురించి ఓపెన్ అయ్యారు. చిరంజీవి, మోహన్ బాబు, సినిమాల వరకు మాత్రమే కాంపిటీటర్స్ అని ఫ్యాన్స్ ఎందుకు భావించడం లేదు ? ఎందుకు అంతలా ట్రోలింగ్ చేసుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించింది.