ఇదిలా ఉండగా, ఎంపురాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదంలో చిక్కుకున్నాయి. దీనికి మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాకుండా, సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 24 సన్నివేశాలు సినిమాలో నుంచి తొలగించి మళ్లీ సెన్సార్ చేశారు. ఈ కొత్త వెర్షన్ నిన్న మొన్నటి నుంచే థియేటర్లలో విడుదలైంది. సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలు తొలగించిన తర్వాత, ఇప్పుడు ఎంపురాన్ వసూళ్ల పరంగా కూడా పడిపోయింది.
Also Read: పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?
పృథ్వీరాజ్ కు నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటీ అని అభిమానులు అడుగుతన్నారు. అయితే ఈసినిమా కోసం పృథ్వీరాజ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వివరణ ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ కోరినట్టు తెలుస్తోంది. గతంలో నటించిన సినిమాల పారితోషికం గురించి కూడా వివరాలు తీసుకున్నారు.
అలాగే ఎంపురాన్ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కో-ప్రొడ్యూసర్గా రూ.40 కోట్ల డబ్బులు (Rs. 40 crore salary) తీసుకున్నారని, దీనికి సంబంధించిన లెక్కలు చూపించాలని ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది ( IT notice to 'Empuran' director Prithviraj) . ఈ సంఘటన మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈసినిమాదే
prithviraj Sukumaran
Prithviraj Sukumaran మలయాళంలో స్టార్ హీరోగా ఉన్నారు. మాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేస్తున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ కు ఆపోజిట్ రోల్ చేసిన సుకుమారన్.. రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఎక్కువ ఆఫర్లు సాధిస్తున్నారు స్టార్ హీరో.