మురారి, ఒక్కడు, అతడు, అర్జున్, ఖలేజా, పోకిరి.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీరిద్దిరి కాంబోలో హిట్ సినిమాలు.. సూపర్ హిట్ పాటలు ఎన్నో. ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ లో ఏ సినిమాలో పాట అయినా బాగాలేదు అన్నవారు లేరు. అన్ని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి.
మరి ఇలాంటా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కు గ్యాప్ ఎందుకు వచ్చింది.ఖాలేజా తరువాత మహేష్ కు మ్యుజిక్ చేయలేదు మణిశర్మ. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మాత్రం బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సరిపెట్టారు. ఆతరువాత మహేష్ బాబు తో మణిశర్మకు చాలా గ్యాప్ వచ్చింది. వీరిద్దరు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు.
కాని రాను రాను.. ఇద్దరిమధ్య గ్యాప్ పెరిగింది. ఇక ఆతరువాత కలిసి సినిమా చేసింది లేదు. మహేష్ బాబు సినిమాలకు మణిశర్మ ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ వచ్చి చేరాడు. దాంతో సూపర్ స్టార్ సినిమాల మ్యూజిక్ పాట్రన్ కంప్లీట్ గా మారిపోయింది.
Also Read: 47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?