విజయశాంతితో ఉన్న పరిచయంతో కర్తవ్యం కథ సిద్ధం చేసి ఆ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. కర్తవ్యం మూవీ సంచలనం విజయం సాధించింది. ఆ తర్వాత ఏం రత్నం అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో తిరుగులేని నిర్మాతగా అవతరించాడు. ఒకే ఒక్కడు, భారతీయుడు, ఖుషి, స్నేహం కోసం, బాయ్స్, 7G బృందావన కాలనీ లాంటి విజయవంతమైన చిత్రాలని ఏఎం రత్నం నిర్మించారు. కర్తవ్యం చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయినప్పుడు కొన్ని వేలమంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారట. కర్తవ్యం చిత్రంతో తనకి దక్కిన సంతృప్తి అది అని ఏఎం రత్నం తెలిపారు.