తెలుగు ప్రజలకు వేణు స్వామిని స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన ఏ జోస్యం అబద్ధం కాలేదు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీల గురించి ఆయన చెప్పినవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. మొదటిసారి.. నాగ చైతన్య , సమంత విడాకులు తీసుకుంటారు అని ఆయన మొదట చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత సమంత, నాగచైతన్య నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో.. అప్పటి నుంచి వేణు స్వామి చెప్పింది జనాలు నమ్మడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత.. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి గురించి, వెరీ రీసెంట్ గా విజయ్- రష్మిక పెళ్లి దాకా వేణు స్వామి చెప్పినట్లే జరిగాయి. ఈ క్రమంలో.. రెండేళ్ల క్రితం వేణు స్వామి మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆయన చెప్పింది.. విజయ్, త్రిష ల గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.