రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ లెవల్ ప్రాజెక్ట్ వారణాసి టైం ట్రావెల్, మైథాలజీ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్ర కథపై విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి అనే భారీ అడ్వెంచర్ టైం ట్రావెల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే ఈ మూవీపై వరల్డ్ వైడ్ గా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మైథలాజీ అంశాలు ఉన్నాయి.
25
శ్రీరాముడిగా మహేష్ బాబు
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీలో 20 నిమిషాల రామాయణం ఎపిసోడ్ ఉంటుంది అని రివీల్ చేశారు. రామాయణం యుద్ధ సన్నివేశాలతో ఉంటుంది అని మహేష్ బాబు శ్రీరాముడిగా అపర పరాక్రమంతో కనిపిస్తారు అని రాజమౌళి అంచనాలు పెంచేశారు. టీజర్ లో శ్రీరాముడికి, ఒక భారీ దేహంతో ఉన్న వ్యక్తికీ యుద్ధం జరుగుతున్నట్లు చూపించారు. ఆ భారీ దేహంతో ఉన్నది కుంభకర్ణుడు అని అభిమానులు గెస్ చేసేశారు.
35
కుంభకర్ణుడి పాత్రలో ఎవరు ?
ఈ మూవీలో ప్రధాన విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అతడి పాత్ర పేరు కుంభ. అంటే రామాయణంలో కుంభకర్ణుడిగా నటించేది కూడా పృథ్వీరాజ్ యేనా ? అతడిని జక్కన్న అంతటి భారీ దేహంతో చూపించబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఆ యుద్ధం జరుగుతున్న చోటికి మహేష్ బాబు, కుంభ ఇద్దరూ టైం ట్రావెల్ చేసి వెళతారు అనేది రివీల్ అయింది.
విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు వారణాసి మూవీ దేని గురించి ? ఇది మైథాలజీ మూవీ నా, టైం ట్రావెల్ మూవీనా అని ప్రశ్నించగా విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇచ్చారు. వారణాసి మూవీ రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధమే. గ్లింప్స్ లో మీరు కుంభకర్ణుడిని చూశారు కదా. ఆంజనేయస్వామి తోకపై మహేష్ బాబు కూడా ఉన్నాడు కదా అని అన్నారు.
55
అది చెప్పకూడదు
ఇందులో టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలు చాలా ఉన్నాయి కదా అని ప్రశ్నించగా.. దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.