అయినప్పటికీ నాన్న వెనక్కి తగ్గకుండా మరో హీరోతో ఆయనే దర్శకుడిగా, నిర్మాతగా ఓరినీ ప్రీమ బంగారం కాను చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు నాన్న సంపాదించిందంతా ఆ చిత్రంతో పోయింది. మా ఫ్యామిలీ మొత్తం తలక్రిందులు అయింది అనే చెప్పాలి. మళ్ళీ జీరో నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అని ఏవీఎస్ తనయుడు ప్రదీప్ అన్నారు.