కార్తీక్, దీపలకు ప్రసాదం ఇచ్చి మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినండి అని చెప్పి జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది పారు. మెడలో తాళి లేదు, కాలికి మెట్టెలు లేవు. కార్తీక్ నీ మొగుడు అంటే పంతులు ఎలా నమ్మాడే అని అంటుంది పారు. ఆడుకునే వయసులో బావను చూపించి అతనే నీ మొగుడు అంటే నేను నమ్మలేదా అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు కార్తీక్, దీప భర్త. వాళ్ల మధ్యలోకి రాకు. దీప జోలికి వస్తే నేను ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది పారు.
నువ్వు ఎందుకు వాళ్ల సైడ్ కి వెళ్లావు. బావ నిన్ను తోలు బొమ్మను చేసి ఆడుకుంటున్నాడు అంటుంది జ్యోత్స్న. నేను గేమ్ చేంజర్ ని అంటుంది పారు. ఇక నిన్ను భరించే ఓపిక నాకు లేదు. ఆఖరి సారి చెప్తున్నా, దీప జోలికి రాకు అంటుంది పారు. దీప నీ సొంత మనుమరాలా? ఎందుకు ఓ అనామకురాలు కోసం నాతో గొడవ పడుతున్నావు అంటుంది జ్యోత్స్న. దీప ఎవరో తెలుసా? అని చెప్పబోయి ఆగిపోతుంది పోరు. ఎవరో చెప్పు అంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ భార్య. కార్తీక్, కాంచన కొడుకు, కాంచన నా భర్త కూతురు అంటే నాకు కూతురే. అప్పుడు దీప నా మనుమరాలే కదా అంటుంది పారు.
అయితే నాతో యుద్ధానికి సిద్ధం అంటున్నావా అంటుంది జ్యోత్స్న. అవును అంటుంది పారు. ఓ మనుమరాలి చేతిలో ఓడిపోయిన నాన్నమ్మలా మిగిలిపోతావు అంటావు అంటుంది జ్యోత్స్న. నువ్వే ఓ నానమ్మ చేతిలో ఓడిపోయిన మనుమరాలిగా మిగిలిపోతావు అంటుంది పారు.