మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఓ టీవీ సీరియల్ ను మిస్ అవ్వకుండా రెగ్యూలర్ గా చూస్తుంది. ఆ సీరియల్ హీరోను తన కొడులా అభిమానిస్తుంటుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అతనికి అంజనమ్మ పంపించిన బహుమతి ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ ఇంట్లో జరిగే ఈవెంట్స్ వల్ల.. ఏదో ఒక అకేషన్స్ లో ఆమె హైలెట్ అవుతుంటారు. ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా వైరల్ అయ్యాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ గురించి అంజనా దేవి చెప్పిన విషయాలు కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక మెగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అంజనాదేవి.. ఖాళీ టైమ్ లో ఓ సీరియల్ ను వదలకుండా చూస్తుంటారట. ఆసీరియల్ మరేదో కాదు కార్తీక దీపం.
25
కార్తీక దీపంలో మెగా మదర్ మెచ్చిన పాత్ర..
తెలుగు టెలివిజన్ రంగంలో కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. సీజన్ 1 తో పాటు.. ప్రస్తుతం నడుస్తున్న కార్తీక దీపం సీజన్ 2 కూడా భారీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది చూస్తుంటారు. అందులో మెగాస్టార్ మాతృమూర్తి అంజనా దేవి కూడా ఉన్నారు. ఈ సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల అంటే ఆమెకు చాలా ఇష్టమట. నిరుపమ్ ను తన కొడుకులా ఆమె అభిమానిస్తుందట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ స్వయంగా వెల్లడించారు.
35
రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బాబు అభిమానులు..
నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ ద్వారా స్టార్ గా మారాడు. వెండితెరపై హీరోలకు ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ బుల్లితెరపై నిరుపమ్ కు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ కు అందులో హీరో అయిన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల కు భారీగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ పరిటాల తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవితో ఉన్న అనుబంధం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ, అంజనా దేవి గారు కార్తీక దీపం సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తారు. ఆ సీరియల్ ఆమెకు ఎంతో నచ్చింది. ఈ సీరియల్ చూసిన తరువాత కొన్ని సార్లు నాతో ఫోన్ లో మాట్లాడారు. అంజనా దేవి గారి బంధువులు మా ఇంటి దగ్గరే ఉంటారు, వారి ద్వారానే నాతో ఆమె మాట్లాడారు. మెగాస్టార్ తల్లిగారితో మాట్లాలంటే మొదట్లో కొంత ఆలోచించాను. కానీ అంతటి పెద్దావిడను నాతో మాట్లాడలని అనుకోవడమే పెద్ద విషయం అనిపించింది. అందుకే ఆమెను గౌరవిస్తూ నేనే ముందుగా ఫోన్ చేసి మాట్లాడాను''. అని నిరుపమ్ అన్నారు.
55
నిరుపమ్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించిన మెగాస్టార్ మాతృమూర్తి..
నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ..'' నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు సీరియల్ గురించి, నా నటన గురించి ఎంతోసేపు చర్చించారు. నువ్వు నా కొడుకు లాంటివాడివి అని అంజనా దేవి గారు చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందిఇక ఒకసారి అయితే నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఒకరు మ్యాంగో బాక్స్ ను పార్సిల్ గా ఇచ్చి వెళ్లారని తెలిసింది. ఆ తరువాత తెలిసింది ఆ పార్సిల్ అంజనా దేవి గారు పంపించారని. వెంటనే వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు కూడా తెలిపాను. అంతే కాదు అప్పుడప్పుడు సీరియల్ చూసిన తర్వాత ఆమె తనకు కాల్ చేసి మాట్లాడుతుంటారని'' నిరుపమ్ వివరించారు.