సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సంచలన పోస్ట్ పెట్టారు. తన పెంపుడు కుక్క ఫొటోతో పాటు ఓ ఘాటైన క్యాప్షన్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకున్నారు. సీఎం విజయ్తో రూమర్స్ వేళ, ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ షేర్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సంచలనంగా మారింది. సౌత్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో ఆమెకు సంబంధం ఉందంటూ వస్తున్న రూమర్ల నేపథ్యంలో త్రిష పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్తో కలిసి ఆమె పలు కార్యక్రమాల్లో కనిపించడం, సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని పెంచేలా పోస్టులు పెట్టడంతో ఈ చర్చ మరింత పెరిగింది.
25
పెంపుడు కుక్క ఫోటో షేర్ చేస్తూ..
త్రిష తన పెంపుడు కుక్క బెడ్పై పడుకున్న ఫొటోను షేర్ చేస్తూ, "నా విషయంలో తలదూర్చడానికి నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే" అని రాసుకొచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే ట్రోలర్స్కు ఇది తెలివైన, ఘాటైన సమాధానం అని చాలామంది భావిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. అంతేకాదు, ఇటీవల 'మ్యాజికల్ మే' అంటూ తన పుట్టినరోజు క్షణాలు, సెల్ఫీలు, తన పెంపుడు కుక్క ఇజ్జీ ఫొటోలను కూడా పంచుకుంది. "మ్యాజికల్ మే నుంచి మరికొన్ని.. గుర్తుచేసుకుని చాలా కాలం నవ్వుకుంటాను" అని ఆమె పోస్ట్ చేసింది.
35
త్రిష, విజయ్ పై రకరకాల రూమర్స్..
విజయ్ 1998లో యూకేలో, 1999లో ఇండియాలో సంగీత స్వరాలింగంను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, జేసన్ సంజయ్, దివ్య సాషా. మరోవైపు, త్రిషకు 2015లో వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో నిశ్చితార్థం జరిగింది, కానీ అదే ఏడాది అది రద్దయింది. ఈ ఏడాది మొదట్లో, విజయ్ ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ, దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధం తర్వాత సంగీత విడాకులకు దరఖాస్తు చేశారని వార్తలు వచ్చాయి. మార్చిలో చెన్నైలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్కు విజయ్, త్రిష ఒకేరకమైన గోల్డ్ కలర్ దుస్తుల్లో హాజరుకావడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇటీవల, విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష తన తల్లి ఉమా కృష్ణన్తో కలిసి హాజరైంది. అక్కడ అభిమానులకు అభివాదం చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత తిరుమల దర్శనం ముగించుకుని, చెన్నైలోని విజయ్ నివాసం నుంచి బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్లకు నవ్వుతూ థంబ్స్-అప్ చూపించింది. నటుడు అజిత్ కుమార్ తల్లి మరణించినప్పుడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన విజయ్తో పాటు త్రిష కూడా వెళ్లింది. అయినప్పటికీ, ఈ రూమర్లపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.
55
వరుస సినిమాలతో బిజీగా త్రిష
ఇక సినిమాల విషయానికొస్తే, త్రిష ఇటీవల 'కరుప్పు' చిత్రంలో కనిపించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. 2026లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇండియాలో 180 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో ఆమె మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'లో కనిపించనుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి పురానిక్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.