Tollywood: సినిమా రంగంలో ప్రతిభకంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే చాలా మంది నటీమణులు బహిరంగానే చెప్పారు. కాగా ఆజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏమన్నారంటే.?
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అందాల తార సమీరా రెడ్డి తన కెరీర్లో ఎదురైన అనుభవాలను తాజాగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఎదురైన ఒత్తిడులు, బాడీ షేమింగ్, కలర్ డిస్క్రిమినేషన్ వంటి విషయాలను బహిరంగంగా వెల్లడించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో “ఫెయిర్ స్కిన్” పట్ల ఉన్న మోజు తనను చాలా ఇబ్బంది పెట్టిందని అన్నారు. సహజంగా ఉన్న రంగు సరిపోదని, ఇంకా తెల్లగా కనిపించాలని మేకప్ ఆర్టిస్టులు ఒత్తిడి చేసేవారన్నారు. ముఖానికి మాత్రమే కాకుండా కెమెరాలో కనిపించే శరీర భాగాలన్నింటికీ మేకప్ వేయాలని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఈ పరిస్థితులు తనలో ఒక సమయంలో ఆత్మన్యూనత భావనను కూడా కలిగించాయని ఆమె వాపోయారు.
25
శరీరాకృతి గురించే చర్చ
హీరోయిన్ల విషయంలో ప్రతిభ కంటే రూపురేఖలపైనే ఎక్కువ చర్చ జరుగుతుందని సమీరా పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్నంత కాలం తన నటన గురించి కాకుండా బాడీ సైజ్ గురించే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు. తాను పొడవుగా ఉండడం వల్ల వయసులో పెద్దదానిలో కనిపిస్తున్నానంటూ.. కొందరు కామెంట్లు చేసేవారని సమీరా చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు తన మనసుపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు.
35
తల్లి అయిన తర్వాత ఎదురైన బాడీ షేమింగ్
2014లో వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన సమీరా, కుటుంబ జీవితం వైపు దృష్టి పెట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో సహజంగా మార్పులు వచ్చాయని ఆమె తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు పెరిగినప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయని అన్నారు. ఆ సమయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లు తన ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు.
తన జీవితంలో కీలకమైన మలుపు రెండోసారి తల్లి అయిన తర్వాతే వచ్చిందని సమీరా అన్నారు. అప్పటి నుంచి తాను తనపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శలు చేసినా వాటిని పెద్దగా పట్టించుకోనని, నెగిటివ్ కామెంట్లకు స్పందించకుండా న్యూట్రల్గా ఉండటాన్ని నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.
55
తెలుగు సినిమాలతో వచ్చిన గుర్తింపు
తెలుగులో సమీరా చేసిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చాయి. నర్సింహానాయుడు, అశోక్, జై చివరంజీవ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన కుటుంబ జీవితం, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.