తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలు హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి చిత్రాల్లో ఆఫర్ వచ్చినా తాను చేయను అని అన్నారు.
తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. వైవిధ్యంగా ఉండే వినోదాత్మక చిత్రాలు తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా నటుడిగా, హీరోగా కూడా తరుణ్ భాస్కర్ కి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తరుణ్ భాస్కర్ నటించిన మూవీ గాయపడ్డ సింహం. మే 1న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
25
అదే చివరి సినిమా అవుతుంది
కశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు దర్శకుడిగా కానీ, హీరోగా కానీ 4 ఫైట్స్, 5 పాటలు, ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉండే సినిమా చేయమంటే చేస్తారా అని అడగగా తరుణ్ భాస్కర్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. అలా చేస్తే నాకు, ఆ నిర్మాతకు అదే చివరి సినిమా అవుతుంది అని అన్నారు.
35
హుస్సేన్ సాగర్ కి..
అలాంటి కమర్షియల్ సినిమా చేయడం నాకు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నాకు నమ్మకం వచ్చినప్పుడు చేస్తానేమో. ఇప్పుడైతే చేయను. అలాంటి సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకుని ఆ తర్వాత నిర్మాత.. నేను హుస్సేన్ సాగర్ కి వెళతా అని అనడం ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు.. కాబట్టి చేయను అని తరుణ్ భాస్కర్ ఫన్నీగా బదులిచ్చారు.
హీరోగా అయితే అస్సలు చేయను. అలాంటి కమర్షియల్ సినిమాలకు హీరోగా నేను సెట్ కాను. దర్శకుడిగా అయితే ఇప్పుడు అలాంటి సినిమాలు చేయను. భవిష్యత్తులో నాకు నమ్మకం వస్తే చేస్తానేమో అని అన్నారు. ఇటీవల కాలంలో తనని బాగా ప్రభావితం చేసిన సినిమాలు రెండు ఉన్నాయి అని తరుణ్ అన్నారు. ఒకటి అర్జున్ రెడ్డి కాగా మరొకరి ధురంధర్. ధురంధర్ 2 నేను ఇంకా చూడలేదు.
55
రియలిజం ఆడియన్స్ కి బాగా నచ్చింది
ఆ సినిమాలకు ముందు వరకు సీన్ లో కామెడీ లేకుంటే ఆడియన్స్ ని థియేటర్స్ లో హోల్డ్ చేయడం కష్టం అని భావించే వాడిని. కానీ ఆ రెండు సినిమాలు చూశాక కామెడీ లేకుండా కేవలం డ్రామాతో ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చొబెట్టొచ్చు అని అర్థం అయింది.ప్రస్తుతం ఆడియన్స్ కామెడీ కంటే అలాంటి డ్రామా సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధురంధర్ చిత్రంలో ఆ రియలిజం ఆడియన్స్ కి బాగా నచ్చింది. అది నిజంగా జరిగిందా లేదా అనేది అనవసరం. కానీ సినిమా చూస్తున్నంతసేపు అది నిజంగా జరిగినట్లు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. 4 గంటల సినిమా తీసి థియేటర్ లో ఆడియన్స్ ని కూర్చోబెట్టారు అంటే ఆదిత్య ధర్ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు కురిపించారు.