Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నాలుగేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవం గురించి ఆమె పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోన్న సాయిపల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు `రామాయణం`లో నటిస్తోంది. సీతగా ఇందులో కనిపించబోతుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ షాకింగ్ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.
26
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన పంచుకున్న సాయిపల్లవి
సాయి పల్లవి మాట్లాడుతూ.. 'సుమారు నాలుగేళ్ల క్రితం ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నాను. అక్కడో రిపోర్టర్, 'మీ మలయాళ నటీనటులు తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడతారు?' అని అడిగారు. దానికి నేను, 'నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు' అని నిజం చెప్పాను' అన్నారు.
36
సాయిపల్లవి బాధపడ్డ సందర్భం
ఆ తర్వాత రెండేళ్లకు, ఓ పత్రికలో 'మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది, తాను మలయాళీ నటిని కాదంది' అని హెడ్లైన్ రాశారు. అది చూసి నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ఓ మహిళ నా దగ్గరికొచ్చి మలయాళంలో మాట్లాడటం మొదలుపెట్టారు. కాసేపయ్యాక, 'అయ్యో.. మీతో మలయాళంలో మాట్లాడితే మీకు కోపం వస్తుందేమో' అన్నారు.
దానికి నేను, 'అయ్యో అస్సలు అలా ఏం లేదు.. నేను ఎప్పుడూ అలా అనలేదు' అని చెప్పాను. కానీ ఆమె నమ్మేలా కనిపించలేదు. ఈ సంఘటనలన్నీ నన్ను చాలా షాక్కు గురిచేశాయి.
56
నాకు భాషా భేదం లేదు
ప్రెస్ మీట్లో నన్ను అడిగిన ప్రశ్న 'మలయాళ నటులు తెలుగు ఎలా ఇంత బాగా మాట్లాడతారు?' అని. దానికి నేను 'నా మాతృభాష తమిళం, మలయాళం కాదు' అని మాత్రమే చెప్పాను. అంతేకానీ, నన్ను మలయాళీ అంటే కోపమని కాదు. నేను నటిగా సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరినీ అలరిస్తాను.
66
వివాదంపై సాయిపల్లవి క్లారిటీ
'నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని కోయంబత్తూర్లో. అందుకే నా మాతృభాష తమిళం అని చెప్పాను. అంతే తప్ప, అది నా భాష కాదు, ఇది నా భాష కాదు అని ఎప్పుడూ చెప్పను' అంటూ సాయి పల్లవి పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.