
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ముగింపు చేరుకునే కొద్ది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రారంభంలో చాలా డల్గా సాగిన ఈ షో ఇప్పుడు రక్తికట్టిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్ రచ్చ రచ్చగా మారింది. ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిన తర్వాత హౌజ్లో తనూజ, దివ్యల మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. వ్యక్తిగతంగా తిట్టుకునే స్థాయికి, వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకునే స్థాయికి దిగజారి తిట్టుకోవడం షాకిస్తుంది. అంతేకాదు ఇతర కంటెస్టెంట్లు కంట్రోల్ చేయకపోతే కొట్టుకునే స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదేమో అనేంతగా సాగింది. శుక్రవారం ఎపిసోడ్లో అంతటి దారుణమైన వాతావరణం బిగ్ బాస్ హౌజ్లో చోటు చేసుకుంది. కెప్టెన్సీ వార్ తారాస్థాయికి చేరుకుంది.
బిగ్ బాస్ తెలుగు 9 శుక్రవారం(75వ ఎపిసోడ్)లో చివరగా ఇమ్మాన్యుయెల్ తల్లి వచ్చింది. ఆయనతో మాట్లాడి, సరదాగా నవ్వించి వెళ్లిపోయింది. దీంతో ఫ్యామిలీ వీక్ ముగిసింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఉన్నవారిలో ఫిల్టర్ చేసే ప్రాసెస్లో భాగంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కి అర్హులు ఎవరు కాదనేది చెప్పాలన్నారు. అందులో భాగంగా ఇప్పుడు కెప్టెన్గా ఉన్న తనూజని తప్పించింది దివ్య. ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నావ్ కాబట్టి వెంటనే వద్దు అనే ఉద్దేశ్యంతో ఆమె తనూజ పేరు చెప్పింది. ప్రతిసారి తన పేరునే తీసుకొస్తుందని చెప్పింది తనూజ ఫైర్ అయ్యింది.
దీంతో తనూజ, దివ్యల మధ్య వాదన స్టార్ట్ అయ్యింది. మాట మాట పెరిగిపోయింది. దారుణంగా తిట్టుకునే స్థాయికి చేరుకుంది. వాదనలు జరిగే క్రమంలో నువ్వేంటో నీ బిహేవియరే చెబుతుందని దివ్యని తనూజ అన్నది. దీంతో నా బిహేవియర్ ఏంటంటూ మండిపడింది దివ్య. ఏం బిహేవియర్ అంటూ ప్రశ్నింది. దీనికి తనూజ కూడా అరిచింది. నువ్వు అరిస్తే నేను అరుస్తా అంటూ వాయిస్ రైజ్ చేసింది దివ్య. దీంతో పీక్లో అరుచుకున్నారు ఇద్దరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ తనూజకి దివ్య వార్నింగ్ ఇచ్చింది. ప్రతిదీ నీకు నచ్చినట్టు పోట్రే చేస్తున్నావని కామెంట్ చేసింది తనూజ. పోట్రే చేసేదేంటి? అంటూ నీ లిమిట్స్ లో నువ్వు ఉండూ అంటూ మండి పడింది దివ్య.
ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు వెటకారంగా రియాక్ట్ అయ్యారు. కామెంట్లు చేసుకున్నారు. వెటకారంలో నేను తోపు అంటూ దివ్య చెప్పింది. అదే నువ్వేంటో అర్థమవుతుందని తనూజ చెప్పింది. నువ్వు ఫేక్ అంటూ దివ్య అన్నది, దానికి తనూజ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో తనూజ కంట్రోల్ తప్పింది. బయట సరిపోక లోపలికి వచ్చావంటూ కామెంట్ చేసింది. దీంతో అందరు షాక్ అయ్యారు. బయట ఏం సరిపోలేదు, ఏం మాట్లాడుతున్నావంటూ ఫైర్ అయ్యింది దివ్య. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, రెస్పెక్ట్ ఏంటో కూడా తెలియదటూ ఫైర్ అయ్యింది దివ్య.
ఈ క్రమంలో ఇద్దరూ పీక్లో అరుస్తూ మీద మీదకు వెళ్లారు. అదే సమయంలో నీకు అందరు కావాలి, అందరు నీ భజనే చేయాలి, నీ చుట్టే తిరగాలని అనుకుంటావని, అలా చేస్తావంటూ దివ్య కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇద్దరు తారాస్థాయిలో అరుస్తూ గొడవపడ్డారు. వీరి మధ్యలోకి భరణిని కూడా లాగారు. ఆయన నన్నెందుకు లాగారని ఫైర్ అయ్యారు. కాసేపు హౌజ్లో సునామీలాంటి వాతావరణం చోటు చేసుకుంది. కొట్టుకుంటారేమో అనేంతగా మీద మీదకు వెళ్లడం గమనార్హం. వీరి గొడవ హౌజ్ని షేక్ చేసింది.
అనంతరం ఈ టాస్క్ లోనే రీతూ, తనూజలు ఇమ్మాన్యుయెల్ పేరు చెప్పారు. మొత్తంగా తనూజ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంది. అనంతరం బిగ్ బాస్ హౌజ్ని రెండు టీమ్లుగా విడగొట్టారు. రెడ్ టీమ్లో ఇమ్మాన్యుయెల్, సంజనా, భరణి, దివ్యలు.. బ్లూ టీమ్లో కళ్యాణ్, రీతూ, డీమాన్ పవన్, సుమన్ శెట్టిలు ఇచ్చారు. వీరికిచ్చిన టాస్క్ లో రీతూ, సుమన్ శెట్టి ఫైనల్ గేమ్కి ఎంపికయ్యారు. ఇందులో రీతూ చౌదరీనే గెలిచి ఈ వారం కెప్టెన్ అయ్యింది. దీంతో ఆమె ఆనందానికి అవదుల్లేవ్.