
తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానటి సావిత్రి. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కేవలం 45 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. 1935లో జన్మించిన ఆమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఆమె చేసిన పాత్రలు, సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి ఉన్నాయి. అనారోగ్య కారణాలతో కోమాలోకి వెళ్లిన సావిత్రి 1981లో మృతి చెందారు.
సావిత్రి తరువాత హీరోయిన్ గా అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. అవ్వడానికి కన్నడ నటి అయినా సౌందర్యను తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. తెలుగులో ‘రాజేంద్రుడు, గజేంద్రుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోయిన్గా ఎదిగారు సౌందర్య. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు, లాంటిస్టార్ హీరోలతో, కుటుంబ కథా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను సాధించింది. ఎక్స్ పోజింగ్ కు ఛాన్స్ లేకుండా, చీరకట్టుతోనే హీరోయిన్ గా ఛాన్స్ లు సాధించిన సౌందర్య.. కట్టు, బొట్టు, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక స్టార్ హీరోయిన్ గా ఫామ్ లో ఉండగానే 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది.
చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. నటుడిగా స్టార్ డమ్ చూశాడు ఉదయ్ కిరణ్. చాలా తక్కువ టైమ్ లోనే హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరున్న ఉదయ్ కిరణ్, మంచి మంచి సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ కెరీర్లో ఎదురైన ఒత్తిడులు, ఫ్యామిలీ లైఫ్ లో ఎదురైన సమస్యల కారణంటా 2014లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణం సినీ ప్రియులను కలచివేసింది. అయితే ఉదయ్ కిరణ్ మరణం కూడా ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది.
హీరో సాగర్ చాలామందికి తెలియదు. కానీ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా హీరో అనగానే మాత్రం వెంటనేగుర్తు పడతారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ యంగ్ హీరో, మరో రెండు సినిమాలు చేసుంటే ఇంకా మంచి గుర్తింపు వచ్చేది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తరువాత మరోసినిమాకు కమిట్ అయ్యారు సాగర్. ఆ సినిమాకోసం బెంగళూరులో షాపింగ్ చేసి, హైదరాబాద్ వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరంగా మారింది.
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆర్తి అగర్వాల్, స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్టీఆర్, ప్రభాస్, తరుణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరనన నటించి మెప్పించింది. కానీ వ్యక్తిగత సమస్యలతో 2015లో ఆమె మరణించారు. ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచింది. కెరీర్ లో ఆర్తి అగర్వాల్ వేసిన రాంగ్ స్టెప్స్ ఆమె కెరీర్ కు శాపంగా మారాయి.
టాలీవుడ్ లో అచ్చ తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేనే లేరు. కాని ఒకప్పుడు ప్రత్యూష లాంటి హీరోయిన్ టాలీవుడ్ నుంచి అనూహ్యంగా ఎదిగింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధిస్తుంది అనుకుంటున్న టైమ్ లో ఆమె 2002లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా నిలిచింది. అయితే ప్రత్యూష మరణం కూడా రాజకీయంగా సంచలనం అయ్యింది. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ నటించిన దివ్యభారతి, రెండు మూడు సినిమాలకే స్టార్ డమ్ ను సంపాదించింది. చిన్న వయస్సులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దివ్య భారతి, 20 ఏళ్లు నిండకుండానే పెళ్ళి చేసుకుంది, 20 ఏళ్లు రాకుండానే కన్నుమూసింది. 1993లో ముంబయిలో అనుమానాస్పద పరిస్థితుల్లో తన ప్లాట్ బాల్కనీ నుంచి కింద పడి దివ్య భారతి మృతి చెందింది. ఆమె మరణం ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది.
తెలుగు సినిమాల్లో తన కామెడీతో అలరించిన వేణుమాధవ్, కాలేయ సంబంధిత వ్యాధులతో 2019లో కన్నుమూశారు. చిన్న వయస్సులోనే ఆయన మృతి తారల మధ్య విషాదాన్ని నింపింది.
నందమూరి తారకరత్న, గుండెపోటుతో 2023 ఫిబ్రవరి 18న బెంగుళూరులో మృతి చెందారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అప్పటివరకు ఎంతో జోష్తో సినిమాలు, రాజకీయాల్లో ముందుకు సాగుతున్న తారకరత్న మృతి సినీ రంగానికి షాక్ ఇచ్చింది.
తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా పేరుగాంచిన శ్రీహరి, 49 ఏళ్ల వయసులో 2013లో ముంబైలో ఒక షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స పొందుతూ లీలావతి హాస్పిటల్లో కన్నుమూశారు.