Ennenno Janmala Bandham: వేదను చూసి కన్నీళ్లు పెట్టిన సులోచన.. యష్ కి గోరుముద్దలు తినిపించిన ఖుషి?

First Published Nov 24, 2022, 1:29 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 24 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

 ఈరోజు ఎపిసోడ్ లో యష్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వసంత్ అక్కడికి వచ్చి నీ ఆలోచన నీ వ్యవహారం నువ్వు చేసే పనులు ఏవి నాకు నచ్చడం లేదు అని అంటాడు. మరొకవైపు చిత్ర పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వెళ్లిన వేద వారి చిత్ర ఆరోజు నువ్వు చెప్పిన మాటలు నువ్వు చూసిన నిజం నేను తప్పని అనుకున్నాను అని అంటుంది. అప్పుడు చిత్ర అక్క ఎందుకు బావ ఇలా మారిపోయాడు ఎందుకు నిన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు అని అడుగుతుంది. మరోవైపు వసంత్ చూడు యష్ నీ గురించి వేద వదిన గురించి నేను చిత్ర ఎంత బాగా మాట్లాడుకుంటామో తెలుసా మీరిద్దరూ సీతారాముల లాంటివారు సీతని ఎక్కడైనా రాముడు కష్టపెడతాడా అని అడుగుతాడు.

 మరోవైపు చిత్ర అక్క నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ఎదుటి వ్యక్తి ఇంత ఆపదలో ఉన్న వారిని మంచి మనసుతో ఆదుకుంటావు అని అంటుంది. మరొకవైపు వసంత్ ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు ఎందుకు వేద వదినను ఇంతలా హార్ట్ చేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత చిత్ర ఎందుకు అక్క బావ నిన్ను ఇంతలా హర్ట్ చేస్తున్నాను నువ్వు మౌనంగా ఉంటున్నావు ఎందుకు నిలదీయడం లేదు అని అడుగుతుంది. మరొకవైపు వసంత్ నువ్వు ఎన్ని తప్పులు చేసినా వేదా వదిన నిన్ను అనుమానించడం లేదు నిందించడం లేదు ఎంత మంచి వదినను అని అంటాడు. ఆ తర్వాత చిత్ర ఎంతగా అడిగినా వేద ఏం మాట్లాడకుండా ఎమోషనల్ గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
 

 మరొకవైపు సులోచన దేవుడి గది వైపు దీర్ఘంగా చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు సులోచన వేదని ప్రశ్నిస్తూ ఈ కేసు ఫైల్ చేయడం అంత అవసరమా అని అంటుంది. ఆ ఏడుకొండల వాడి దయవల్ల నాకు ఇప్పుడు బాగానే ఉంది ఈ కేసు వల్ల నీకు లేనిపోని చికాకులు ఈ కేసు వల్ల వదిలేయ్ వేద అని అంటుంది సులోచన. అప్పుడు నా వల్లే నీకు ఇదంతా జరుగుతోంది అని సులోచన ఎమోషనల్ అవ్వగా ఏం కాదు నువ్వు ఊరుకో అమ్మ అని ఓదారుస్తుంది వేద. నువ్వు అల్లుడుగారు హ్యాపీగా ఉన్నారు మీ బంధం బలపడుతుంది అనుకుంటున్న సమయంలోనే ఇలా జరిగింది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది సులోచన
 

 అల్లుడుగారు ఎంత మంచి వారు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది సులోచన. అప్పుడు వేద అమ్మ ఏడవకు అమ్మ అని ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వేదా ఎమోషనల్ అవుతూ నా బలం నువ్వే అమ్మా నన్ను ఓదార్చు నన్ను బుజ్జగించు అంటూ సులోచన చేతులు పట్టుకుని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. నాకు వీలైతే ధైర్యం చెప్పు అంతేకాని నన్ను భయపెట్టొద్దమ్మా అని సులోచన చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంది వేద. ఇది నాకు పరీక్ష సమయం ఇప్పటికే నేను అన్ని విషయాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నాకు అడ్డుపడకమ్మా అని అంటుంది వేద.
 

ఆ తర్వాత యష్ ఇంటికి వస్తాడు. అప్పుడు వేద యష్ ని చూసి కూడా చూడనట్టు ఉంటుంది. అప్పుడు యస్ వేదాన్ని పిలవకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత యష్ తినడానికి అని వెళ్లగా అక్కడ ఏమీ లేకపోవడంతో నీళ్లు తాగుతాడు. అప్పుడు యస్ వెళ్లి సోఫాలో కూర్చోగా ఇంతలోనే ఖుషి, యష్ కోసం భోజనం తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఏంటి ఖుషి ఇంకా పడుకోలేదు అనడంతో అందరూ నీ మీద కోపంగా ఉన్నారు పడుకున్నారు మరి నీకు అన్నం ఎవరు పెడతారు అందుకే పడుకోలేదు నాన్న అని అంటుంది. అప్పుడు యష్ ఖుషి మాటలు విని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని యష్ ని నవ్విస్తుంది ఖుషి.

మరొకవైపు వేద జరిగిన విషయాల గురించి తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఖుషి అక్కడికి వచ్చి అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నాన్నకు భోజనం తినిపించాను అని అనడంతో వేద సంతోషపడుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం మాలిని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. భగవంతుడా నాకు ఇటువంటి రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఒకవైపు కొడుకు మరొకవైపు కోడలు. నా మనసు మతం నా కోడలు వైపే మొగ్గు చూపుతోంది కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వేద అక్కడికి వచ్చి హారతి తీసుకుంటుంది. అప్పుడు యెస్ కూడా అక్కడికి వచ్చి అమ్మ నా లైఫ్ లో ఇది కీలకమైన రోజు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నా లేకపోయినా తప్పకుండా అమ్మ ఆశీస్సులు ఉండాలి అమ్మ ఆశీస్సులు ఉంటే ఏదైనా జరుగుతుంది అని మాలిని బ్లెస్సింగ్స్ తీసుకుంటారు వేద యష్.

click me!