జబర్దస్త్ (Jabardasth)లో లుకలుకలు మొదలయ్యాయని, త్వరలో ఓ టాప్ టీం షో నుండి బయటికి వెళ్ళిపోతుందని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి పుకార్లే వచ్చిన నేపథ్యంలో వీటిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.
అయితే ఈ కథనాల్లో నిజం ఉందని తాజా ఎపిసోడ్ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ఈనెల 10 శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో కొద్దినిమిశాల క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమో ఎప్పటిలాగే ఎంటర్టైనింగ్ గా సాగింది. సుడిగాలి సుధీర్ టీం డిఫరెంట్ గా ఓ స్కిట్ ట్రై చేశారు.
లైవ్ షో కాకుండా రాకెట్ రాఘవ, హైపర్ ఆది నివాసాలకు వెళ్లి అక్కడ జరిగిన కామిక్ సన్నివేశాలతో కూడిన వీడియో షోలో ప్రసారం చేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ప్రోమో చివర్లో ముగ్గురూ వేదికపైకి వచ్చి బాంబు పేల్చారు. ముందుగా గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి వెళ్లి పోతున్నట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని అనుకున్నాము.. అయితే స్టేజి పై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇన్నాళ్లు మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. మమల్ని క్షమించండి... అంటూ రామ్ ప్రసాద్ ముగించారు. కాసేపు వేదికపై ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు.
జబర్దస్త్ వేదిక ద్వారా ఫుల్ ఫేమస్ అయిన సుధీర్, గెటప్ శ్రీను (getup sreenu), రాంప్రసాద్ సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. సుధీర్ హీరోగా సినిమాలు చేస్తుండగా .. గెటప్ శ్రీను అనేక చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ సైతం పలు చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఆయన రైటర్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నట్లు సమాచారం.
జబర్దస్త్ షోతో వీరికి దాదాపు తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది. వీరికి జబర్దస్త్ టాలెంట్ నిరూపించుకోవడానికి వేదిక ఇస్తే... ఆ జబర్దస్త్ కి వీరు తమ కామెడీ స్కిట్స్ ద్వారా పాపులారిటీ తెచ్చిపెట్టారు. ఎపిసోడ్ మొత్తంలో సుడిగాలి సుధీర్ టీం(Sudigali sudheer) హైలెట్ కామెడీ పంచుతుంది.