Prema Entha Madhuram: గుండెలవిసేలా ఏడుస్తున్న సుబ్బు దంపతులు.. అను ఆర్య చెంతకు చేరుతుందా?

Navya G | Published : Jun 5, 2023 7:03 AM
Google News Follow Us

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. దూరమైన భార్య పిల్లల కోసం తాపత్రయపడుతున్న ఒక భర్త కథ సీరియల్. ఇక ఈరోజు జూన్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

19
Prema Entha Madhuram: గుండెలవిసేలా ఏడుస్తున్న సుబ్బు దంపతులు.. అను ఆర్య చెంతకు చేరుతుందా?

 ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లలకి ట్రీట్ చేసిన డాక్టర్ వీళ్ళకి మామూలు జ్వరమే సిరప్ రాస్తాను అది పట్టండి. రెండు గంటలు అబ్జర్వేషన్ లో ఉండండి ఆ తర్వాత తీసుకెళ్ళిపోదురు గాని అంటాడు. అలాగే అంటూ అను వాళ్ళు అక్కడినుంచి అబ్జర్వేషన్ రూమ్ లోకి వెళ్తుంటే మరొక డాక్టర్ చూసి అనుని గుర్తుపట్టి జెండే కి ఫోన్ చేస్తాడు. మేము వెంటనే వచ్చేస్తాము మేము వచ్చేవరకు ఆమెని అక్కడ నుంచి కదలనివ్వకండి హోల్డ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
 

29

 తర్వాత నీరజ్ కి ఆర్య కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్లు కూడా కంగారుగా హాస్పిటల్ కి బయలుదేరుతారు. అదే సమయంలో సుబ్బూ దంపతులు యాత్రల నుంచి తిరిగి వస్తూ కూతుర్ని మనువల్ని చూడాలని ఆత్ర పడుతూవుంటారు. మన బుజ్జమ్మ నిన్న కాక మొన్న పుట్టినట్లుగా ఉంది అప్పుడే తనకి పిల్లలు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా అయినా అనునీ పిల్లల్ని రెండు మూడు నెలలు మన ఇంట్లో ఉంచుకోవాల్సిందే అంటూ ఎమోషనల్ అవుతాడు సుబ్బు.
 

39

 అందుకు ఆర్య సర్ ఒప్పుకున్నా బుజ్జమ్మ ఒప్పుకోదు అంటుంది పద్దు. మనమే బుజ్జమ్మ దగ్గర ఉండిపోదాము అంటాడు సుబ్బు. మనుమల దగ్గరికి వచ్చేసరికి తాత గారికి ఆత్మాబిమానం మరిచిపోయినట్లున్నారు అని నవ్వుతుంది పద్దు. ఆర్య ఇంటికి వెళ్లి ఆనందంగా అనుని పిలుస్తారు.ఆ హడావుడికి శారదమ్మ వాళ్ళు హాల్లోకి వస్తారు. శారద మని పలకరించి బుజ్జమ్మ మనవులు ఎక్కడున్నారు వాళ్ళని చూడాలని చాలా ఆత్రంగా ఉంది.
 

Related Articles

49

వాళ్ల కోసం తాయత్తులు ప్రసాదాలు తీసుకువచ్చాను అంటుంది పద్దు. మనవలు పుట్టారని తెలిసిన దగ్గరనుంచి కనీసం దైవ దర్శనం కూడా చేసుకోలేదు తన కంగారుపడి నన్ను కంగారుపడి పెట్టేసింది అంటూ భార్య గురించి చెప్తాడు సుబ్బు.అను లేదు.. పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తుంది మాన్సీ. ఒకసారి గా షాక్ అవుతారు సుబ్బు దంపతులు. ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని నిలదీస్తుంది పద్దు.
 

59

అది మీ అమ్మాయికి తెలియాలి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మాన్సీ. ఇలాగే తన గుండెలు బద్దలయ్యేలాగా ఏదో మాట్లాడి ఉంటారు మనసు విరిగిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. సమయానికి మేము కూడా ఊర్లో లేకుండా పోయాము ఇద్దరు పిల్లలతో ఎంత బాధ పడుతుందో ఏంటో అంటూ ఏడుస్తారు సుబ్బు దంపతులు. పదం మన పిల్లని మనమే వెతుక్కుందాం అంటుంది పద్దు.
 

69

 అను కనిపించని మాట నిజమే కానీ ఆర్య సార్ వాళ్ళు వెతకడానికి వెళ్లారు. ఖచ్చితంగా తీసుకొని వస్తారు. దయచేసి ఓపిక పట్టండి అని అంజలి చెప్తుంది. అయినా ఆవేశంలో ఉన్న సుబ్బు దంపతులు వినిపించుకోకుండా బయటికి వచ్చేస్తారు. ఏం చేయాలో తోచని అంజలి నీరజ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. వదినమ్మ జాడ దొరికింది తీసుకురావడానికి వెళ్తున్నాము వాళ్ళని కాస్త ఓపిక పట్టమను అంటాడు  నీరజ్.
 

79

అదే విషయాన్ని బయట ఉన్న సుబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తుంది అంజలి. వెనకే శారదమ్మ కూడా వచ్చి ఆర్య చెప్పాడంటే కచ్చితంగా చేసి తీరుతాడు  దయచేసి లోపలికి రండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అప్పటికి శాంతించిన సుబ్బు దంపతులు లోపలికి వెళ్లి కూర్చుంటారు. మళ్లీ వెనక్కి వచ్చిన సుబ్బు వాళ్ళని చూసి నిజంగానే అనూజాడ దొరికిందా.. ఒకవేళ దొరికినా తను రావాలి కదా చచ్చిన రాదు అని మనసులో అనుకొని పైకి వెళ్ళిపోతుంది మాన్సీ.
 

89

మరోవైపు జెండే వాళ్ళు హాస్పిటల్ కి చేరుకుంటారు. చిల్డ్రన్ వార్డులో ఉన్నారు వెళ్లి చూడండి అంటాడు డాక్టర్. అక్కడికి వెళ్లేసరికి అను ఉండదు. షాక్ అవుతారు ఆర్య వాళ్ళు. అదే విషయాన్ని అక్కడే ఉన్న సిస్టర్ ని అడిగితే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు సార్ వెనకనుంచి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు అని చెప్తుంది సిస్టర్. ఇప్పుడే వెళ్ళింది అంటే ఈ చుట్టుపక్కలే ఉంటుంది పదండి వెళ్దాం అంటూ మళ్లీ వెతుకులాట ప్రారంభిస్తారు ఆర్య వాళ్ళు.
 

99

 పక్కనే బెంచి వెనకన ఉంటుంది అను. ఎందుకమ్మా ఇలా దాక్కోవటం అని అడుగుతుంది బామ్మ. ఇప్పుడు నన్ను ఏమీ అడగకండి బామ్మ అంటుంది అను. సిరప్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆర్య వాళ్లు కంగారుగా హాస్పిటల్ లోకి రావడం సీసీ కెమెరా ద్వారా చూడడాన్ని గుర్తు చేసుకుంటుంది అను. అదే సమయంలో బయటికి వెళ్ళబోతున్నవాడల్లా ఒక్కసారిగా ఆగుతాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

Recommended Photos