శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?

First Published Jul 14, 2024, 7:54 AM IST

దివంగత స్టార్ హీరోయిన్.. అతిలోక సుందరి శ్రీదేవికి ముగ్గురు కూతుర్లు ఉన్నారా..? జాన్వీకపూర్, ఖషి కపూర్ తో పాటు శ్రీదేవికి మూడో కూతురు ఉందా..? ఈ రహస్యం ఎలా బయటకు వచ్చింది. 

శ్రీదేవి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా వెలుగు వెలిగిన తార.. అనుకోని పరిస్థితుల్లో దృవతారగా నింగికెగసిన హీరోయిన్. తెలుగు,తమిళ సినిమాల్లో అద్భుతం చేసిన ఈ అందం.. బాలీవుడ్ చేరిన తరువాత మహాద్బుతంగా మారింది. హీరోయిన్ గా, నిర్మాతగా శ్రీదేవి  సినీ ప్రయాణం.. ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈక్రమలో ఆమె మరణం అభిమానులను క్రుంగదీసింది. 

ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?

sridevi and boney kapoor


ఇక శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ను ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు కూమార్తెలు.. పెద్దకూతురు జాన్వీ కపూర్ కాగా.. రెండో కూతురు ఖుషీకపూర్. వీరిద్దరు పెరిగి పెద్దవారై.. హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తారు అనుకున్న టైమ్ లో శ్రీదేవి మరణించింది. జాన్వీ కపూర్ స్క్రీన్ ఎంట్రీ చూడకుండానే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే శ్రీదేవి మరణించిన ఏడాదే జాన్వీ ధడక్ సినిమాతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. 

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..
 

Latest Videos


కాగా శ్రీదేవికి ఇద్దరు కూతర్లే అని అంతా అనుకుంటుండగా.. ఆమెకు మూడో కూతురు కూడా ఉందని తాజా సమాచారం.  శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు జాన్వీ కపూర్. మరొకరు ఖుషీ కపూర్ తన భర్త బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు శ్రీదేవి గర్భవతి. పెళ్లి తర్వాత జాన్వీకి జన్మనిచ్చింది. కొన్నాళ్ల తర్వాత శ్రీదేవికి ఖుషీ కపూర్ అనే మరో కూతురు పుట్టింది.

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..
 

అయితే శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు కాకుండా మరో కూతురు ఉందని మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు సజల్. అవును శ్రీదేవి చివరిగా నటించిన మామ్ సినిమాలో.. శ్రీదేవి కూతురుగా నటించింది సజల్. అయితే ఈసినిమా షూటింగ్ టైమ్ లో వీరి బంధం బలపడిందట. శ్రీదేవి కూడా ఈసినిమా టైమ్ లో నాకు సజల్ మూడో కూతురితో సమానం. తనతో నాకు అంతలా బాండింగ్ ఏర్పడింది అని చెప్పారు. సజల్ తల్లి మరణించడంతో.. తనను కూతురిగా భావించినట్టు శ్రీదేవి చెప్పారు

సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?
 

ఈసినిమా టైమ్ లో సజల్ శ్రీదేవికి బిడ్డగా దగ్గరయ్యింది. మరణించిన తన తల్లిని శ్రీదేవిలో చూసుకునేది సజల్. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినసజల్ శ్రీదేవి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తన తల్లి మరణించాక.. శ్రీదేవిలో  అమ్మను చూసుకున్నాను. కాని దేవుడు ఈ అమ్మను కూడా దూరం చేశాడు అంటూ బాధపడింది.  “సజల్ నాకు మూడో సంతానం లాంటిది. "ఇప్పుడు నాకు మరో కూతురు ఉన్నట్లు అనిపిస్తుంది అని శ్రీదేవి అనేవారని సజల్ గుర్తు చేసింది. 

ఎప్పుడు ఎక్కడ ఉన్నా.. తనతో ఫోన్ లో మాట్లాడేది.. మిస్ యూ అని మెసేజ్ కూడా పెట్టేదట శ్రీదేవి. ఇలా తమ బంధం గురించి తాజాగా బయటపడింది. శ్రీదేవికి మూడో కూతురు ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఇక శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. స్టార్ గా మారింది. బాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్ కూడా సాధించింది శ్రీదేవి. 

janhvi kapoor

ఇక తాజాగా ఆమె సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్ జంటగా.. దేవర సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్. ఈమూవీ ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో ఉంది. ఇక రామ్ చరణ్ తో మరో సినిమా కమిట్ అయ్యింది జాన్వీ. రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. 

click me!