సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. బాలీవుడ్ ను కూడా దశాబ్ధానికి పైగా మహారాణిలా ఏలిననటి శ్రీదేవి. అతిలోక సుందరిగా, దేవకన్యగా పిలవబడ్డ ఆమె గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి హఠాన్మరణం తో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎంతోమంది మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసింది శ్రీదేవి. శ్రీదేవికి సినిమానే ప్రపంచం.. అందుకే తన ఇద్దరు కూతుర్లను కూడా తెరపై చూడాలని ముచ్చటపడింది. కాని ఆమె ఆశ నెరవేరకముందు ఆమె కన్నుమూసింది. ఇక శ్రీదేవి కనుమూసే వరకు కూడా సినిమానే ప్రపంచంగా బ్రతికింది. హీరోయిన్ గా తన గ్లామర్ దెబ్బతినకూడదని చాలా కఠినమైన నియమాలు పాటించింది.
2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అనుకోని పరిస్థితుల్లో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్ రూమ్ లో.. బాత్ టబ్ లో విగతజీవిగా కనిపించింది. శ్రీదేవి ఆహారనీయమాలు పాటించడం.. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ.. ఇబ్బందిపడేదని ఫ్యామిలీ మెంబర్స్ చెపుతుంటారు.
శ్రీదేవి భర్త బోని కపూర్ కూడా ఇదే చెప్పారు. ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటించేది అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేది. అలానే బాత్ టబ్ లో పడిపోయిన శ్రీదేవి.. నీటిలో ఊపిరి ఆడక చనిపోయిందని ఆయన చెప్పారు. అయితే ఇక్కడే ఓ చిన్న విషయం వైరల్ అవుతోంది. శ్రీదేవికి జలగండం ఉందట. దాని వల్లే ఆమె ఇలా మరణించిందని ప్రచారం జరుగుతోంది.
Photo Courtesy: Instagram
గతంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా ఇలానే ఓ గండం నుంచి బయటపడిందట. 1972లో వచ్చిన బాలభారతం షూటింగ్ టైమ్ లో.. వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ జరగ్గా.. అందులో పడి ఆమె మునిగిపోయిందట. తోటి నటులకు ఈత రావడంతో ఆమెను కాపాడారంటూ.. ఓ న్యూస్ వైరట్ అవుతోంది.
ఈ విషయాన్ని ఆ సినిమాలో బాల నటుడిగా నటించిన కమెడియన్ విశ్వేశ్వరరావు ఓ సందర్భంలో చెప్పినట్టుగా సమాచారం. ఈ విషయం అధికారికంగా తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం శ్రీదేవికి జలగండం ఉన్నట్టు ప్రచారం గట్టిగా జరుగుతోంది.