ఎన్టీఆర్-చరణ్ మధ్య చిచ్చు పెట్టిన రాజమౌళి కెమెరా మెన్... మళ్ళీ ఫ్యాన్ వార్ షురూ!

First Published Apr 19, 2024, 3:40 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్దానికి కారణం అవుతుంది. ఈ ఫ్యాన్ వార్ సమసిపోయింది అనుకుంటే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మరలా అగ్నికి ఆజ్యం పోశాడు. 
 

NTR and Ram Charan


దశాబ్దాలుగా నందమూరి-మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ తరచుగా కొట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా రాకతో ఫ్యాన్ వార్స్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో చోటు చేసుకుంటున్నాయి. 
 

ఈ క్రమంలో నందమూరి-మెగా హీరోల మల్టీస్టారర్ అనగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. రాజమౌళి దర్శకుడు కావడంతో ఇది సాధ్యం అయ్యింది. అయితే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రల్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చర్చ మొదలైంది.


రామ్ చరణ్ పాత్ర విలక్షణమైనది. ఆ పాత్ర చేయడం చాల కష్టం అన్నాడు. పరోక్షంగా ఎన్టీఆర్ పాత్రను తగ్గించి మాట్లాడాడు. ఇది ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయేంద్రప్రసాద్ ని తిట్టిపోశారు. 

naatu naatu song


ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు అవుతుండగా ఈ గొడవలు సద్దుమణిగాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ చేసిన కామెంట్స్ మరలా అగ్నికి ఆజ్యం పోశాయి. ఆయన మాట్లాడుతూ... ఆర్ ఆర్ ఆర్  క్లైమాక్స్ కంటే జంతువులతో ఎన్టీఆర్ జంప్ చేసే ఇంటర్వెల్ సీన్ హైలెట్ అన్నారు. 

అలాగే అడవిలో ఎన్టీఆర్ ని పులి ఛేజింగ్ చేసే సీన్ చేసే టప్పుడు ఆయన వేగాన్ని మేము అందుకోలేకపోయాము. అంత వేగంగా ఎలా పరిగెత్తావని అడిగితే.. నేను నేషనల్ లెవెల్ అథ్లెట్ ని అని ఎన్టీఆర్ అన్నాడు. అందుకే ఎన్టీఆర్ ని తెలుగువాళ్లు టైగర్ అని పిలుచుకుంటారు... అని కామెంట్స్ చేశాడు. పరోక్షంగా చరణ్ కంటే ఎన్టీఆర్ సీన్స్ హైలెట్ అని సెంథిల్ కుమార్ అన్నాడు.

NTR - Ram Charan

ఈ క్రమంలో చరణ్ ఫ్యాన్స్ నొచ్చుకునేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది.  రకరకాల కామెంట్స్ తో మాటల యుద్ధం చేసుకుంటున్నారు. 
 

click me!