మహానటి సావిత్రి మరియు ‘కాదల్ మన్నన్’ జెమినీ గణేషన్ల వ్యక్తిగత జీవితం, వారి అనుబంధంపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఎన్నో రకాల అభిప్రాయాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సావిత్రిని జెమినీ గణేషన్ మోసం చేశాడని తెలుగు ప్రజలలో చాలామంది అభిప్రాయం. మహానటి తాగుడికి బానిసై.. నరకయాతన పడటానికి ఆయనే కారణమని అంటుంటారు.
46 ఏళ్లచిన్న వయసులోనే సావిత్రి మరణించడం అభిమానులకు ఇప్పటికీ తీరని బాధను మిగిల్చింది. అయితే సావిత్రికి జరిగిన అన్యాయంలో తప్పు ఎవరిది అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. చాలామంది జెమినీ గణేషన్ ను విమర్శిస్తుంటే.. కొంత మంది మాత్రం జెమినీ మంచితనం గురించి మాట్లాడుతున్నారు.
ఆయన సావిత్రిని ఎంత ప్రేమించారన్న విషయంపై తమ వాదన వినిపిస్తున్నారు. ఈక్రమంలో ఈ సినిమా జంటకు అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన సీనియర్ నటి రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో సావిత్రమ్మ జీవితంలో జరిగిన పొరపాట్లు, జెమినీ గణేషన్ యొక్క మంచితనం, సావిత్రి పట్ల ఆయన ఆప్యాయత గురించి సంచలన విషయాలు వెల్లడించారు.