Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published : Apr 03, 2026, 06:32 PM IST

Sapthami Gowda: నటీమణుల ఫోటోలు, వీడియోలను అసభ్యంగా చిత్రీకరించి వైరల్ చేసే వారిపై నటి సప్తమి గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రవర్సీ చేసే వాళ్లతో తాను యుద్ధానికి దిగితే వారికి నరకం చూపిస్తానని హెచ్చరించారు.

PREV
16
కోపంతో ఊగిపోతున్న సప్తమి గౌడ

నటి సప్తమి గౌడ ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నారు. ఇటీవల కొందరు హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను అసభ్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమె గట్టిగా గొంతెత్తారు. లైక్స్, వ్యూస్ కోసం కొందరు చేసే పనుల వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై స్పందించిన సప్తమికి చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు.

26
గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నటి

ఈ వివాదం నేపథ్యంలో, కాంట్రవర్సీలు సృష్టించే వారికి సప్తమి గౌడ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. `కాంట్రవర్సీ చేసే వాళ్లపై నేను యుద్ధానికి దిగితే, జరిగేది వేరేలా ఉంటుంది. దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది` అని ఆమె హెచ్చరించారు.

36
నరకం అనుభవిస్తారు

'kadakk_talks' అనే ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తమి ఈ వ్యాఖ్యలు చేశారు సప్తమి. `నేను నా యుద్ధాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాను. ఒకవేళ మీరే నన్ను ఆ యుద్ధభూమిలోకి లాగితే, మీకు నరకం కనిపిస్తుంది. ఆ యుద్ధంలో నేనే గెలుస్తానని నాకు తెలుసు` అంటూ కాంట్రవర్సీ క్రియేటర్స్‌కు ఆమె వార్నింగ్ ఇచ్చారు.

46
టైమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తా

`కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. కానీ నేను అనవసరంగా మాట్లాడను. వచ్చే ప్రతీదాన్ని తీసుకుంటూనే ఉంటాను. మనం మాట్లాడకపోతే మనదే తప్పు అనుకున్నా పర్లేదు. సరైన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి` అని సప్తమి అన్నారు.

56
గెలిచి తీరుతాను

`నేను యుద్ధభూమిలోకి దిగుతున్నానంటే, దాన్ని ముగించేదాకా వదలను. అందులో నేను కచ్చితంగా గెలుస్తాను. కానీ దానివల్ల మీకు కలిగే నష్టాన్ని మీరు తట్టుకోలేరు. ఇది నా ఛాలెంజ్` అని సప్తమి గౌడ స్పష్టం చేశారు.

66
ఏకమైన మహిళలు

`సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ తీవ్రమైన సమస్యపై మేమంతా ఒక్కటయ్యాం. పబ్లిక్ ఈవెంట్లలో నటీమణుల వీడియోలు, ఫోటోలను అసభ్యకరమైన యాంగిల్స్‌లో తీస్తున్నారు. వారి నటన కంటే శరీరంపైనే అనవసరంగా జూమ్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఇకపై చుక్కలే` అని సప్తమి గౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories