2003లో విడుదలైన సంజయ్ దత్ 'మున్నా భాయ్ MBBS' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో వినోద్ చోప్రా ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.
10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన 'మున్నా భాయ్ MBBS' సినిమా 33 కోట్లు వసూలు చేసింది. సంజయ్ దత్, గ్రేసీ సింగ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సౌత్లో 3 రీమేక్లు వచ్చాయి.
2004లో 'మున్నా భాయ్ MBBS' సినిమా 'శంకర్ దాదా MBBS' పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. చిరంజీవి, సోనాలి బెంద్రె నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. దీనికి జయంత్ సీ పరాంజీ దర్శకుడు.
2004లోనే 'మున్నా భాయ్ MBBS' సినిమా 'వసూల్ రాజా MBBS' పేరుతో తమిళంలో రీమేక్ అయ్యింది. కమల్ హాసన్, స్నేహ, ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. శరణ్ దీనికి దర్శకుడు.
2007లో 'ఉప్పి దాదా MBBS' పేరుతో కన్నడలో రీమేక్ అయ్యింది. ఉపేంద్ర, ఉమా, అనంత్ నాగ్ నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
2017లో శ్రీలంకలో 'డాక్టర్ నవారియా' పేరుతో సింహళ భాషలో రీమేక్ అయ్యింది. అక్కడ మాత్రం ఈ సినిమా హిట్ నిలవడం విశేషం.
'మున్నా భాయ్ MBBS' సినిమాకి 'లగే రహో మున్నా భాయ్' పేరుతో 2006లో సీక్వెల్ వచ్చింది. సంజయ్ దత్తోపాటు విద్యా బాలన్, అర్షద్ వార్సీ నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో చిరంజీవి హీరోగా `శంకర్ దాదా జిందాబాద్` పేరుతో రీమేక్ అయ్యింది. యావరేజ్గానే ఆడింది.