ఇక మూడో ఛాక్లెట్ దర్శకుడు అట్లీకి ఇస్తానని పేర్కొంది. ఆయనతో చాలా సినిమాలు చేశానని, తన ఫేవరేట్ డైరెక్టర్ అని చెప్పింది. ఇలా ముగ్గురు తమిళ స్టార్స్ కే ప్రయారిటీ ఇచ్చింది సమంత. కానీ తెలుగు వారికి హ్యాండిచ్చింది. తెలుగు హీరోలతో, డైరెక్టర్లతో కూడా వర్క్ చేసింది.
ఇంకా చెప్పాలంటే సమంతకి తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడే పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి తమిళ స్టార్స్ కే పెద్ద పీఠ వేయడం ఆశ్చర్యపరుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సమంత టాలీవుడ్ని పక్కన పెట్టడానికి కారణం తన జీవితంలో జరిగిన సంఘటనలేనా? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ కన్వర్జేషన్ తమిళ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే జరిగిందని, అందుకే వాళ్ల పేర్లు చెప్పిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.