అందుకు కారణం.. పద్మనాభం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. రేఖ అండ్ మురళీ కంబైన్స్ పతాకంపై ఐదారు సినిమాలను నిర్మించారు. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎక్కువా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
తనకు ఇదే బాగా నష్టాలను తీసుకొచ్చిందట. చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణమట. ఇక్కడే వందల కోట్లు సంపాదించారు. అన్నీ ఇక్కడే పోగొ్ట్టుకున్నారు. తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం కుదరలేదు, ఎవరినో నమ్మి చేస్తే వాళ్లు మోసం చేశారు.