స్టార్ హీరోయిన్ సమంతకి సంబంధించిన ఓ రూమర్ చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇళ్లుని కూడా వెతుకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు కలిసి టెంపుల్స్ సందర్శించారు. కలిసి సెల్ఫీలు దిగారు.
ఇలా తరచూ వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు దర్శకుడి భుజంపై తలపెట్టి ఆమె చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. దీంతో వీరి మధ్య రిలేషన్కి సంబంధించిన రూమర్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది. ఆ రూమర్లు మరింతగా వ్యాపిస్తున్నాయి.
ఈ క్రమంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ కూడా స్పందించింది. ఆమె ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా గురించి ఆలోచించే వారికి, నన్ను చూసే వారికి, నా గురించి వినేవారికి, నాతో మాట్లాడేవారికి, నా గురించి రాసేవారికి, నన్ను కలిసేవారికి ప్రేమతో, ఆశీర్వాదాలతో నా ప్రేమని పంపుతున్నాను` అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడితో తమ బాండింగ్ బాగుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది.
ఈ క్రమంలో తాజాగా సమంత డేటింగ్ రూమర్లపై ఆమె మేనేజర్ స్పందించారు. అసలు నిజం బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని, అందులో నిజం లేదన్నారు. అయితే మేనేజర్ రియాక్షన్కి, సమంత చేసే పనులకు పొంతన లేకపోవడం ఆశ్చర్యకరం. మరి ఏది నిజమనేది మున్ముందు కాలమే సమాధానం చెబుతుంది.
అన్నట్టు సమంత నిర్మాతగా మారి ఇటీవల `శుభం` చిత్రాన్ని నిర్మించింది. కొత్త నటీనటులు నటించిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. డీసెంట్ కలెక్షన్లని వసూలు చేసింది. ఈ క్రమంలో సినిమా సక్సెస్ టూర్లు కూడా నిర్వహించారు. సమంత కూడా ఇందులో పాల్గొంది. ఇక హీరోయిన్ గా సమంత `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరో మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. వీటికి సంబంధించిన అప్ డేట్లు రావాల్సి ఉంది.