ఇక సమంత , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇక వీరి కాంబో కూడా మరోసారి కలవబోతున్నట్టు టాక్ . ఆ సినిమా మరేదో కాదు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్.
ఈ పాన్ ఇండియా మూవీని రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రకటించారు.సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సన్ పిక్చర్స్ దాదాపుగా 800 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేయబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుకు ప్రియాంక చోప్రా ను తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈమూవీ చేయలేను అని చెప్పిందట.
ఇక ఆమె తరువాత ఈ కథను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల హీరోయిన్ సమంత అని అనుకున్నారట టీమ్. పైగా డైరెక్టర్ అట్లీ కూడా గతంలో సమంత తో ‘మెర్సల్’, ‘తేరి’ వంటి సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ కూడా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట.
lso Read:రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?