Guppedantha Manasu: స్టోర్ రూమ్‌లో రిషీ, వసు రొమాన్స్.. చాటుగా వీడియో తీసిన సాక్షి!

Published : Jul 25, 2022, 09:39 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Guppedantha Manasu: స్టోర్ రూమ్‌లో రిషీ, వసు రొమాన్స్.. చాటుగా వీడియో తీసిన సాక్షి!

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని(devayani), మహేంద్ర దంపతులు గౌతమ్ కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా అప్పుడు మహేంద్ర కాఫీ బాగుంది అని ధరణిని పొగుడుతూ ఏంటి ఈ మార్పు అని అనగా ఇదే కాదు మహేంద్ర చాలా విషయాలలో చాలామంది ఇంట్లో మారిపోయారు అనడంతో వెంటనే మహేంద్ర మార్పు సహజమే కదా వదిన అంటూ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత మహేంద్ర, ధరణి( Dharani)అందరూ కలిసి దేవయానిని ఒక ఆట ఆడుకుంటారు.
 

27

ఇప్పుడు ధరణి దేవయాని(devayani)కి చిన్న చిన్నగానే గట్టిగా కౌంటర్లు ఇవ్వడంతో మహేంద్ర దంపతులు నవ్వుతూ ఉంటారు. మరొకవైపు వసు కాలేజీ లో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. రిషి(rishi) గురించి ప్రాజెక్ట్ విషయం గురించి తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత సాక్షి,దేవయానికి ఫోన్ చేస్తుంది.    అప్పుడు దేవయాని, సాక్షికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఆ తర్వాత వసు స్టోర్ రూమ్ కీ వెళ్తుంది. అప్పటికే రిషి షో రూమ్ లో ఏదో వెతుకుతూ ఉంటాడు.
 

37

ఇంతలోనే వసు(vasu) అక్కడికి రావడంతో ఏంటి సెక్యూరిటీ ఇప్పుడా రావడం అని అంటాడు. ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు సరదాగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి అక్కడ కత్తిరి ఉంటే తీసుకు వస్తావా అని అనగా వసు కత్తిరి కోసం వెళ్తూ ఉండగా అనుకోకుండా పడిపోతూ ఉండగా ఇంతలో రిషి, వచ్చి వసు ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వలలో చిక్కుకుంటారు. మరొకవైపు సాక్షి (Sakshi)అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడు వసు ఏం జరిగింది సార్ అని అనగా నువ్వు వచ్చావు స్టోర్ రూమ్ పరిస్థితి మొత్తం మారిపోయింది అంటాడు రిషి.
 

47

అయితే జరిగింది మొత్తం సాక్షి ఊహించుకుంటూ స్టోర్ రూమ్ లో స్టోరీ అంటూ ఆ వీడియో వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆ వీడియోతో ఎలా అయినా వారిని బ్లాక్ మెయిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మహేంద్ర(mahendra)  దంపతులు కాలేజీకి వచ్చి రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సాక్షి, జగతి(jagathi) దంపతులను చూసి పెళ్లి పలకరిస్తుంది. ఆ వీడియో గురించి మనసులో అనుకుంటూ మహేంద్ర వాళ్ళని వెటకారంగా మాట్లాడిస్తుంది సాక్షి.
 

57

సాక్షి (sakshiL)మాటలకు జగతి కోసం రగిలిపోతుంది. అప్పుడు సాక్షికి గట్టిగా కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి, వసు ని ఎందుకు అనవసరంగా లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని హెల్త్ పాడు చేసుకుంటావని తిడుతూ ఉంటాడు. అప్పుడు సార్ నేను చదువుల పండుగ గురించి ఆలోచిస్తూ ఇదంతా చేస్తున్నాను అని అంటుంది వసు. నీకు తోచిన విధంగా నువ్వు ఆలోచనలు తీసుకుంటావా నన్ను అడగవా అని అనగా వెంటనే వసు(vasu)మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు కలిసి మాట్లాడదామంటే టైం ఇవ్వరు అని అనగా అప్పుడు చూసి మౌనంగా ఉంటాడు.
 

67

అప్పుడు మీరు మారిపోయారు సార్ అని అనగా అవును నీ వల్లనే మారిపోయాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడు రిషి(rishi), నువ్వు స్టోర్ రూమ్ లోకి ఎందుకు వచ్చావు అని అడగగా చదువులు పండగ కోసం ఒక జెండాను ఏర్పాటు చేద్దామనుకున్నాను అని అంటుంది. అప్పుడు వసుధార నేను ఆ జెండాను చూపిస్తాను అనగా వెంటనే రిషి తన ఫోన్ లో జెండాను చూపించడంతో మీరు నా ఆలోచన అని కాపీ కొట్టారు అని అంటుంది వసు(vasu). అప్పుడు వారిద్దరూ సరదాగా వాదించుకుంటూ ఉంటాడు.
 

77

ఇంతలోనే అక్కడికి మహేంద్ర(Mahendra)దంపతులు వస్తారు. అప్పుడు వారందరూ ఆ ఫ్లాగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత వసు, రిషి గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్ తనలతోనే మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో సాక్షి(sakshi) ఎదురుపడుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీటింగ్ హాల్లో రిషి వసుధారని పెన్ డ్రైవ్ అడగగా ఎక్కడో పడిపోయింది అని అంటుంది వసు. అప్పుడు సాక్షి రెచ్చిపోతూ ఇలాంటి బాధ్యత లేని వారికి చదువులు పండుగ గురించి అప్పగిస్తే ఎలా చేస్తారు ఇలాంటి వారికి పనిష్మెంట్ ఇవ్వు అనడంతో వెంటనే రిషి పనిష్మెంట్ ఇస్తాను అని అంటాడు.

click me!

Recommended Stories