Guppedantha Manasu: వసుధార, రిషీలను అడ్డంగా ఇరికించిన సాక్షి.. జగతి, మహేంద్రకు అవమానం!

First Published Jun 30, 2022, 9:06 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu) నీళ్ల బిందె తీసుకొని రాగా అప్పుడు ధరణి ఏంటి వసు ఇది అని అనగా తాగడానికి నీళ్లు రాలేదు అందుకే అలా వీధిలోకి వెల్లి తెచ్చుకుంటున్నాను అని అంటుంది. ఆ తరువాత గౌతమ్, రిషీ, ధరణి(Dharani)వసుధారకి స్వీట్ తినిపించి కంగ్రాచులేషన్ చెప్తారు. అప్పుడు గౌతమ్ కాస్త కామెడిగా మాట్లాడతాడు.
 

అప్పుడు గౌతమ్(gautham)ఏంటి వసు మీ ఇంటికి వచ్చిన మీ ఎండి గారికి కాఫీలు టీలు ఏం మర్యాదలు చేయవా అంటూ రిషీ ని ఆట పట్టిస్తాడు. అప్పుడు రిషీ,వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషీ బిందెలతో నీళ్లు మోయొద్దని చెప్పండి వదిన అని ధరణికి చెబుతాడు. ఆ మాటలకు వసుధార(vasudhara)సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు ఫణింద్ర ఆనందంగా ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు దేవయాని ఆ గుడ్ న్యూస్ అంటే చెబితే నేను సంతోషిస్తాను కదా అని అనగా అప్పుడు పనింద్ర దేవయానిని కామెడీగా మాట్లాడుతూ ఆట పట్టిస్తాడు.
 

ఇంతలోనే రిషీ(rishi) వాళ్ళు రావడంతో దేవయాని,ధరణిపై కోప్పడగా అప్పుడు రిషీ వదినను నేనే పిలుచుకు వెళ్లాను అని చెబుతాడు. అప్పుడు రిషీ వసు గురించి మాట్లాడగా దేవయాని (devayani )ఇన్ డైరెక్టుగా గౌతమ్ ని తిట్టడంతో అప్పుడు రిషీ దేవయాని తగిన విధంగా బుద్ది చెప్పడంతో దేవయాని మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత పనింద్ర, గౌతమ్ అందరూ వసుధార గురించి పొగుడుతూ ఉంటారు.
 

 అప్పుడు దేవయాని(devayani)మాత్రం కుళ్లు కుంటూ ఉంటుంది. మరొకవైపు వసు పేరు నోటీస్ బోర్డ్ లో వేయడంతో స్టూడెంట్స్ అందరూ చదివి ఆనంద పడుతూ ఉంటారు. ఆ తరువాత పుష్ప వచ్చి వసు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పుష్ప(pushpa)మాట్లాడుతూ సన్మాన సభకు సంబంధించిన ఏర్పాట్లు రిషి సార్ దగ్గరుండి చూసుకుంటున్నాడు అనడంతో వసుధార సంతోషపడుతుంది.
 

మరోవైపు రిషి(rishi) జగతి దంపతులకు ఏర్పాటు ఎక్కువగా చేయకూడదు అని కండిషన్లు పెడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వసు కనిపించకపోవడంతో రిషి, వసు కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార కనిపించడంతో అలా వసుధర వైపు చూస్తూనే ఉంటాడు. అప్పుడు జగతి(jagathi), మహేంద్ర లు కమిషనర్ గురించి మాట్లాడగా వసు వైపు చూస్తూనే సమాధానం చెబుతాడు.
 

ఆ తరువాత మహేంద్ర(Mahendra)కమిషనర్ గురించి చెప్పగా తప్పకుండా పిలవాలి అని అంటాడు రిషి. ఆ తర్వాత జగతి వసు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వుండగా రిషి అక్కడే ఉంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు (vasu )ఆగండి సార్ అని అరిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు.
 

ఇంతలో మహేంద్ర (Mahendra)అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగడంతో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి మళ్లీ కార్యక్రమానికి రావడం తో సాక్షి(sakshi)అక్కడికి వచ్చి వసుధార కి రిషికు ప్రపోజ్ చేసిన వీడియో ని బయట పెడుతుంది. దాంతో అదంతా వసుధార ప్లాన్ అనుకున్న రిషి తనపై కోపంగా అరుస్తాడు.

click me!