Guppedantha manasu: సాక్షికి వసుధార షాకింగ్ వార్నింగ్... వసుకి సాయం చేసిన రిషీ!

Published : Aug 22, 2022, 08:06 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

PREV
17
Guppedantha manasu: సాక్షికి వసుధార షాకింగ్ వార్నింగ్... వసుకి సాయం చేసిన రిషీ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు, ఒక దారానికి ఆ ఉంగరాన్ని కట్టి మెడలో వేసుకుంటుంది. అదే సమయంలో రిషి వసు దగ్గరికి వస్తాడు. వసూ కంగారుగా చైన్ మీద చున్ని కప్పేస్తుంది.బుక్స్ మీద విఆర్ అని రాసి ఉంటుంది. ఆ బుక్స్ ని మూసేస్తుంది. ఇప్పుడెందుకు సార్ వచ్చారు అని వసుధార అడగగా ఎందుకు వసుధార ఏదో తప్పు చేసినట్టు మొహం అలా పెట్టావు, ఆ మెడలో దారం ఏంటి అని రిషి అంటాడు. దానికి వసుధార, ఏమీ లేదు సార్ అని అంటుంది. అప్పుడు పక్కనున్న ఒక బుక్ తీసుకొని ఇవన్నీ ముఖ్యమైన లెసన్స్.
 

27

వాటిని ఈరోజు రాత్రికి చదివి రేపు ఉదయం కల్లా నాకు చెప్పు అని అంటాడు. అప్పుడు వసు మనసులో, రిషి సార్ కి నేనంటే ఎంత జాగ్రత్త అని అనుకుంటుంది. ఈ లోగ రిషి, వసు చేయ పట్టుకొని 10000 రూపాయలు ఇచ్చి నీకు డబ్బు అవసరం ఉందని మేనేజర్ చెప్పారు. అది ఎందుకో నాకు అనవసరం కానీ భవిష్యత్తులోనికి ఏ డబ్బు అవసరమైనా సరే నన్నే అడగాలి. ఇంక ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు తిరిగి మేనేజర్ కి ఇచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రోజు ఉదయం రిషి, వాసుధారకు ఫోన్ చేద్దామా? కారణం లేకుండా ఫోన్ చేస్తే బాగోదేమో అని అనుకుంటాడు. ఇంతట్లో గౌతమ్ అక్కడికి వస్తాడు అదే సమయంలో వసు, రిషికి ఫోన్ చేయగా గౌతమ్ లాక్కొని  మాట్లాడుతాడు.
 

37

అప్పుడు వసు కింద హాల్లోనే ఉన్నాను సార్ అని అంటుంది. కిందున్నావా? అని గౌతమ్ అనేలోగే రిషి పరిగెత్తుకొని కిందకు వెళ్తాడు. ఇంతట్లో ధరణి వసు దగ్గరికి వచ్చి కాఫీ కావాలా అని అడుగుతుంది. అప్పుడు దేవయాని,వసు ఏమి కొత్త చుట్టం కాదు విద్యార్థి మాత్రమే కాఫీలు టీ లు ఏం అవసరం లేదు అని అంటుంది. అప్పుడు దేవయాని, ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చావు వసుధార అని అడుగుతుంది. రిషి సార్ పిలిచారు మేడం అని అంటుంది. ఇంటట్లో  రిషి అక్కడికి వచ్చి, పెద్దమ్మ నేను వడుధార ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాము మీరు వెళ్ళండి అని అంటాడు.
 

47

దేవయాని వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వచ్చావు వసుధార అని రిషి అడగగా మీరే రమ్మన్నారు కదా సార్ అవన్నీ చదివి రేపటికి చెప్పమన్నారు కదా, అందుకే రాత్రి అంతా కూర్చొని చదివాను అని అంటుంది. ఇప్పుడు వద్దు కాలేజీకి వెళ్ళాక చెప్పు నాకు అని చెప్పి అక్కడ నుంచి వడుధార ని పంపించేస్తాడు. ఇంతట్లో గౌతమ్ జగతి,మహీంద్ర దగ్గరికి వెళ్లి వసు వచ్చింది, వెళ్లిపోయింది కూడా అని అంటాడు. అదేంటి ఇంటికి వచ్చి మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయింది అని వసుకి ఫోన్ చేస్తుంది జగతి. ఏమైంది వసు,రిషికి నీకు ఏమైనా గొడవ అయిందా అని అనగా లేదు మేడం ఏం అవలేదు మీరు భయపడొద్దు.
 

57

సార్ ఏదో పని చెప్పారు అది చేశాను అందుకే వచ్చాను అని అంటుంది. అప్పుడు జగతి  మనసులో, ఈ మధ్య వసు జరిగినది సరిగ్గా చెప్పడం లేదు, మరీ అడిగితే బాగోదేమో అని మనసులో అనుకొని ప్రస్తుతానికి చదువు మీద దృష్టిపెట్టు వసు నువ్వు గొప్ప దానివి అవ్వాలి అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సీన్లో వసుధార కాలేజ్ కి నడుస్తూ ఉండగా సాక్షి దారిలో కార్ ఆపి ఎలాగున్నావ్ వసూధార అని అడుగుతుంది. దానికి వసుధారా నేను చాలా చాలా బాగున్నాను సాక్షి అని అంటుంది. ఆరోజు రిషి అన్న మాటలకి వెంటనే నీకు వెళ్లి ఉంగరం తొడిగేస్తాడు అనుకున్నాను ఉంగరం పెట్టుకోలేదేమి అని అనగా ప్రేమకు ఉంగరాల లాంటి వస్తువులతో పనిలేదు సాక్షి, మనసులో ఉంటే చాలు అని అంటుంది వసు.
 

67

ఆ మాటలకు సాక్షి, రిషి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు వసుధార. రిషి కన్నాలున్న పడవ లాంటోడు సముద్రంలోకి వెళ్తే ఎప్పటికైనా విరిగిపోతుంది అని అంటుంది. అప్పుడు వసుధార, నా గురించి నేను చూసుకుంటాను సాక్షి నువ్వు కూడా జీవితంలో పక్క వాళ్ళు సలహా లేకుండా ఏది నచ్చితే అది చేయు లేకపోతే పారాషూట్ లేకుండా పైనుంచి దూకినట్టు ఉంటుంది నీ బతుకు. ఇందాక నువ్వు అన్నట్టు కన్నాలు ఉన్న పడవలో ఎక్కితే కనీసం ఈదుకుంటూ తీరం చేరొచ్చు. పైనుంచి దూకితే నీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత కాలేజీకి వెళ్తుంది వసు. అప్పుడు రిషి కార్ చూస్తుంది.కొంచెం సేపు ఈ కార్ నే రిషి సార్ అనుకోని మాట్లాడుకుందాం అని  అనుకుంటుంది.
 

77

చూడండి రిషి సార్, ఎప్పుడూ ఇలాగే మీరు చెప్పినవన్నీ నేను వింటాను కానీ నేను తిరిగి మాట్లాడేసరికి తర్వాత చూద్దాము ఇప్పుడు వద్దు అని నా మాట కూడా పూర్తి చేయనివ్వరు. ఇలాగైతే చాలా కష్టం సార్. నేను అలిగాను అని అంటుంది.అయినా అలిగితే అలకతీంచడం కూడా మీకు రాదు అసలు ఎప్పుడు సార్ అర్థం చేసుకుంటారు అనేలోగా పక్కనుంచి రిషి ఇదంతా వింటాడు. ఏంటి వసుధార తనలో తానే మాట్లాడుకుంటుంది అని అనుకుంటాడు.ఈ లోగ వసుధార మీరు ఇప్పుడు కనబడండి ప్రశ్నల వర్షం కురిపిస్తాను ఆ  ప్రశ్నలేంటో కూడా నాకు తెలీదు అని అనగా రిషి వసుధార ఎదురుగా వెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories