`కూలీ` సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. తాను ఈ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గురించి ఆలోచించడం లేదని, కానీ ఆడియెన్స్ కి రూ.150 టికెట్ రేట్ల గురించి ఆందోళనగా ఉందన్నారు.
టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే సినిమా ఆడియెన్స్ కి దూరమవుతుందని, వారికి అందుబాటులో టికెట్ రేట్లు ఉండాలని ఆయన వెల్లడించడం విశేషం.