Roja: నాగార్జునతో ఇబ్బంది, బాలయ్యతో చేయను, చిరంజీవితో రొమాన్స్ కి సై.. రోజా సంచలన స్టేట్‌మెంట్‌

Published : May 22, 2026, 07:46 PM IST

రోజా ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. తాజాగా ఆమె సీనియర్‌ హీరోలతో నటించడంపై స్పందించింది. నాగార్జునతో, బాలయ్య, వెంకీలతో నటించనని ఓపెన్‌గా చెప్పేసింది. 

PREV
15
చిరంజీవితో మరోసారి రొమాన్స్ కి రోజా సై

మాజీ మంత్రి, నటి ఆర్కే రోజా ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బుల్లితెరపై మెరుస్తోంది. అడపాదడపా టీవీ షోస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దమే అని హింట్‌ ఇస్తోంది. రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే విషయాన్ని బయటపెట్టింది. చిరంజీవిపై విమర్శలు చేసి, ఆయన్ని అవమానించిన రోజా.. ఇప్పుడు ఆయనతోనే నటిస్తానని ప్రకటించింది. అంతేకాదు బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.

25
రోజాని ఆడుకున్న జాఫర్‌

తాజాగా రోజా.. ఫ్యామిలీ అసెంబ్లీ పేరుతో ఓ షో నిర్వహిస్తోంది. సీనియర్‌ జర్నలిస్ట్ జాఫర్‌ యాంకర్‌గా ఈ షో రన్‌ అవుతోంది. జీ తెలుగులో ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇందులో బతుకు జట్కా బండీ తరహాలో ఒక ఎపిసోడ్‌ని నిర్వహించారు. ఇందులో రోజా, విష్ణుప్రియా, పృథ్వీ వంటి వారు పాల్గొన్నారు. అందులో భాగంగా రోజాని పలు ఇంట్రెస్టింగ్‌, కాంట్రవర్షియల్‌ ప్రశ్నలు వేశారు జాఫర్‌. దీనికి రోజా సమాధానాలు క్రేజీగా ఉన్నాయి.

35
జాఫర్‌కి మైండ్‌ బ్లాక్‌ చేసిన రోజా

మిమ్మల్ని ఫైర్‌ బ్రాండ్‌ అంటారు, మీకు కోపం ఎప్పుడు వస్తుందని జాఫర్‌ ప్రశ్నంచగా, మీరు ఇంటర్వ్యూ కోసం ఫోన్‌ చేసినప్పుడు కోపం వస్తుందని తెలిపింది. ఇంకా కోపం ఎప్పుడొస్తుందని అడగ్గా, ఆ ఇంటర్వ్యూ ట్రోల్‌ అయినప్పుడు అని, ఇంకా కోపం ఎప్పుడు వస్తుందని అడగ్గా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు అని దిమ్మతిరిగే సమాధానం చెప్పింది రోజా. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ప్రెస్‌ మీట్లలో ఒకలా ఉంటారు, ఇది నిజమా, అది నిజమా అని ప్రశ్నంచగా, దానికి రోజా ఇచ్చిన రియాక్షన్‌ క్రేజీగా ఉంది. మీరు ఎప్పుడు చూసినా ఇలాంటి కాస్ట్యూమ్స్ లోనే ఉంటారు, చూడ్డానికి బాగాలేదు, కాస్ట్యూమ్స్ మార్చొచ్చు కదా అని జాఫర్‌కే ఝలక్‌ ఇచ్చింది రోజా.

45
చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీలతో నటించడంపై రోజా కామెంట్‌

టీవీ షోస్‌లో మీరు చాలా మంది జడ్జ్‌ లతో పనిచేశారు. మీ ఫేవరేట్‌ జడ్జ్ ఎవరు అనగా, అనిల్‌ రావిపూడి, సరదాగా, జోవియల్‌గా ఉంటారు, తన లిమిట్స్ లో తాను ఉంటారు, ఆయనతో జడ్జ్ చేయగా చేయడం నచ్చిందని రోజా తెలిపింది. పేరు చెప్పని జడ్జ్‌ గురించి జాఫర్‌ ప్రశ్నించగా, మీరే పేరు చెప్పడానికి భయపడుతున్నారు, నేనేందుకు చెబుతాను అని కౌంటర్‌ ఇచ్చింది రోజా. ఇక ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తే, టాప్‌ హీరోల్లో ఎవరితో నటిస్తారని ప్రశ్నించాడు జాఫర్‌. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ పేర్లు కూడా చెప్పాడు.

55
బాలయ్యతో, నాగార్జునలతో మళ్లీ నటించనని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

దీనికి రోజా రియాక్ట్ అయితే, తాను నటించడానికి ఓకే, వాళ్లు నాతో నటిస్తారో లేదో అని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ అదే ప్రశ్న వేయగా, తాను చిరంజీవితోనే నటించేందుకు ఇష్టపడతాను, ఆయన డాన్సులంటే ఇష్టమని తెలిపింది. ఈ క్రమంలో బాలయ్య మనిషిగా ఇష్టం, కానీ చిరంజీవి పక్కన అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందని తెలిపింది. ఇక నాగార్జున గురించి అడిగితే, నాగార్జునగారికి తాను అభిమానిని అని, ఆయనతో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. వెంకటేష్‌ ప్రస్తావన రాగా, ఆయనతో ఒక్కటే సినిమా చేశాను, పెద్దగా చేయలేదు, ఇంట్రెస్ట్ లేదని వెల్లడించింది. బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ కాదు, చిరంజీవితోనే సినిమా చేస్తానని రోజా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories