‘కరుప్పు’ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ కామెంట్స్, ఆయన చేసే యాక్టివిటీస్ సూర్య అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో వాళ్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు.
సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఇప్పటికే 310 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, సూర్య కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఇంత పెద్ద విజయం వచ్చినా, సూర్య అభిమానులు మాత్రం డైరెక్టర్ ఆర్జే బాలాజీపై తీవ్రమైన కోపంతో ఉన్నారు.
26
సూర్య అభిమానులకు కోపం తెప్పించిన ఆర్జే బాలాజీ
సినిమా విజయవంతంగా నడుస్తున్న టైంలో, డైరెక్టర్ ఆర్జే బాలాజీ, సీఎం విజయ్ను కలిశారు. ఈ భేటీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, "ఆయన వల్లే 'కరుప్పు' సినిమా మొదలైంది. ఈ మీటింగ్ను నమ్మలేకపోతున్నా` అని బాలాజీ క్యాప్షన్ పెట్టారు. బాలాజీ పెట్టిన ఈ పోస్టే సూర్య అభిమానుల కోపానికి అసలు కారణం.
36
కరుప్పు స్టోరీ మొదట విజయ్కే చెప్పిన దర్శకుడు
ఆర్జే బాలాజీ ఇంతకుముందు ఒక స్టేజ్ పై, "ఈ కథను నేను మొదట విజయ్కే చెప్పాను. అది ఆయన చివరి సినిమా అయ్యుండేది. కానీ ఆయన హెచ్. వినోత్ సినిమాకు ఓకే చెప్పారు. ఆ తర్వాతే నేను సూర్యాకు ఈ కథ చెప్పాను" అని ఓపెన్గా మాట్లాడారు.
విజయ్ కి `కరుప్పు` సక్సెస్ క్రెడిట్ ఇవ్వడంపై ఆగ్రహం
ఇప్పుడు సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యాక, సినిమా సక్సెస్ క్రెడిట్ను సూర్యకు ఇవ్వకుండా, విజయ్ను కలిసి 'ఆయన వల్లే సినిమా మొదలైంది' అని బాలాజీ చెప్పడం సూర్య అభిమానులకు చిరాకు తెప్పించింది. "మా హీరో ఈ సినిమాకు సెకండ్ ఛాయిస్ అయినా పర్లేదు, కానీ విజయం క్రెడిట్ ఇచ్చేటప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని అభిమానులు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.
56
సూర్య లేకపోతే కరుప్పు లేదు
సూర్య అభిమానుల కోపానికి మరో ముఖ్య కారణం బాక్సాఫీస్ లెక్కలు. తాజా రిపోర్టుల ప్రకారం, 'కరుప్పు' సినిమా విజయ్ నటించిన 'బిగిల్' (300 కోట్లు), 'వారిసు' (310 కోట్లు) సినిమాల వసూళ్ల రికార్డును బ్రేక్ చేసింది. విజయ్ రికార్డును బ్రేక్ చేసిన సినిమా పెట్టుకుని, డైరెక్టర్ మళ్లీ విజయ్నే పొగడటం అభిమానులకు నచ్చడం లేదు. "సూర్య లేకపోతే ఈ సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసేది కాదు" అనేది అభిమానుల వాదన.
66
వివాదానికి సూర్య క్లారిటీ
ఈ వివాదం నడుస్తుండగానే, నటుడు సూర్య తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. "ప్రేమతో ముందుకు సాగండి. వినయంగా, ఉదారంగా ఉండండి" అని అందులో రాశారు. అభిమానులు గొడవపడటం ఇష్టం లేని సూర్య, పరోక్షంగా సైలెంట్గా ఉండమని సలహా ఇచ్చారని వారు భావిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమా, న్యాయవ్యవస్థలోని అవినీతి గురించి చర్చిస్తుంది. ఎన్ని వివాదాలు ఉన్నా, 'కరుప్పు' సినిమా ప్రస్తుతం కోలీవుడ్లో సునామీ సృష్టిస్తోందన్నది నిజం!