తన క్యారెక్టర్ బ్యాడ్గా చేయడంపై ఆమె స్పందిస్తూ, తానేంటో తనకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, అమ్మకి తెలుసు. వాళ్లు ఎవరో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కావాలని బ్యాడ్ చేయాలనుకుంటే కర్మ తిరిగి కొడుతుంది. అదే తాను నమ్ముతానని, అందుకే సైలెంట్గా ఉన్నట్టు చెప్పింది రీతూ చౌదరీ. ఒకడు ఇదే కరెక్ట్ అని తాను నమ్మితే, నేను వచ్చి ఏం చెప్పినా నమ్మడు, తనదే రైట్ అనుకుంటాడు. అలాంటి వాడి కోసం నేను బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకు అని వెల్లడించింది రీతూ. అంతేకాదు నాన్న చనిపోయాక అంత దూరమయ్యారని, చుట్టాలు ఎవరూ లేరని, తనకు ఎవరూ ఫోన్ చేయరని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రీతూ చౌదరీ. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.