ఎపిసోడ్ ప్రారంభంలో పంతులుగారు కృష్ణ దంపతులచే అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు. కృష్ణ, మురారి కూడా మనస్ఫూర్తిగా ప్రమాణాలు చేస్తారు. అది చూసిన ముకుంద ఇది హోమం లాగా అనిపించడం లేదు అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి జరుగుతున్నట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు.