డైరెక్టర్లకి సారీ చెప్పిన రష్మిక మందన్నా.. గాయం గురించి చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్

Published : Jan 11, 2025, 11:20 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా గాయపడిన విషయం తెలిసిందే. జిమ్ లో గాయపడ్డ ఆమె తాజాగా స్పందించింది. దర్శకులకు ఆమె సారీ చెప్పడం విశేషం.   

PREV
14
డైరెక్టర్లకి సారీ చెప్పిన రష్మిక మందన్నా.. గాయం గురించి చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్

`పుష్ప 2` సినిమాతో సంచలనాలు సృష్టించిన నేషనల్‌ క్రష్, రష్మిక మందన్నా గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్‌లో గాయపడింది. జిమ్‌ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది.  తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. 
 

24

సోషల్‌ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన్నా. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైమ్‌ పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. 
read more: సీక్రెట్ మ్యారేజ్‌పై స్టార్‌ హీరోయిన్‌ అదిరిపోయే రియాక్షన్‌, తాను సీరియల్‌ డేటర్ ని అంటూ స్టేట్‌మెంట్‌

34

ఇందులో రష్మిక చెబుతూ, `సరే, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటున్నా. నేను నా జిమ్‌లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితితో ఉన్నాను. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడుకే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే నేను `థామ`, `సికిందర్‌`, `కుబేర` చిత్రాల సెట్‌లోకి అడుగుపెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ.

నా కాళ్లు యాక్షన్‌లోకి దిగడానికి ఓకే అని నిర్థారించుకున్న వెంటనే సినిమా సెట్‌లోకి అడుగుపెడతాను. ఈ లోగా మీకు నేను అవసరమైతే చాలా అధునాతనమైన బన్నీ హోప్‌ వ్యాయామం చేయడానికి కూడా రెడీగానే ఉంటాను` అని తెలిపింది రష్మిక మందన్నా. దర్శకుల గురించి ఆలోచించి ఆమె ఈ పోస్ట్ పెట్టడం విశేషం. 
 

44

రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `సికిందర్‌` సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో `ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ, `కుబేర` చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవలే అల్లు అర్జున్‌తో కలిసి నటించిన `పుష్ప 2` విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది.

ఇది ఏకంగా రూ.1900కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో ఇండియా వైడ్‌గా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలిచింది రష్మిక మందన్నా. సక్సెస్‌ జోరులో ఉన్న ఆమె గాయపడటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటున్నారు. 

read more: నిహారికా బెడ్‌ సీన్‌ చేసినా ప్రయోజనం లేదా?, మెగాడాటర్‌ తమిళ సినిమా కలెక్షన్లు చూస్తే షాక్‌

also read: డాక్టర్‌ కాదు, పిల్లల్ని కనడం కాదు, సౌందర్యకి సినిమాల్లో తీరని కోరిక ఏంటో తెలుసా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories