Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?

Published : Feb 25, 2026, 03:27 PM IST

Virosh Wedding:  టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందనా, విజయ్ దేవర కొండలు త్వరలో వివాహం చేసుకోనున్నారు. అక్టోబర్ లో ఈ జోడి నిశ్చితార్థం జరిగింది. కానీ, ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. 

PREV
13
రష్మిక- విజయ్..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనా రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.కానీ ఈ జంట మాత్రం బయటపడలేదు. కానీ.. రీసెంట్ గా.. తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో జరగుతుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. తర్వాత.. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం రిసెప్షన్ ఉంటుంది.

23
రెండు సంప్రదాయాల్లో వివాహం..

హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. కాగా.. పెళ్లి మాత్రం రెండు సంప్రదాయాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ వైపు నుంచి తెలుగు సంప్రదాయం ప్రకారం.. అదేవిధంగా.. రష్మిక కొండవ శైలిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది. వివాహానికి సంబంధించి పూజారులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

33
పెళ్లిలో పంది మాంసం..?

అయితే.. వీరి పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం... విజయ్-రష్మిక పెళ్లిలో పంది మాంసం అతిథులకు వడ్డించనున్నారట. నిజానికి.. మన తెలుగు సంప్రదాయంలో ఇలా పంది మాంసం వడ్డించం. కానీ.. రష్మికకు చెందిన కొండవ సంప్రదాయం ప్రకారం.. కచ్చితంగా పంది మాంసం వడ్డిస్తారట.ఇంట్లో పెంచుకున్న పందిని వడ్డిస్తారట. దీనితో పాటు కదంబుట్టు, వెదురు షూట్ కర్రీ వంటి వంటకాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాదు ఈ సంప్రదాయం ప్రకారం..పురోహితులు పెళ్లి చేయరంట.కుటుంబంలోని పెద్దలు మాత్రమే చేస్తారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories