ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. చరణ్ ఓ సంచలన దర్శకుడితో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగా. `అర్జున్రెడ్డి`, `యానిమల్` చిత్రాలతో సంచలనాలు సృష్టించారు సందీప్ రెడ్డి వంగా. ఆయన రామ్ చరణ్కి స్క్రిప్ట్ చెప్పారని సమాచారం.
ఈ మూవీ లాక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ కాంబోలో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే పోస్ట్ లు కూడా కనిపించాయి. ఇవి ఫ్యాన్స్ ఉత్సాహంతో పెట్టిన పోస్టులా? నిజంగానే చర్చలు జరిగాయా? అనేది సస్పెన్స్. ఏది నిజమనేది క్లారిటీ లేదు.