`అపరిచితుడు` మూవీ ఆగిపోయిన తర్వాత కొంత గ్యాప్తో రవితేజ హీరోగా `నీకోసం` సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు శ్రీనువైట్ల. ఇందులో మహేశ్వరి హీరోయిన్. బ్రహ్మాజీ, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంట్ హిట్గా నిలిచింది. దర్శకుడు శ్రీనువైట్లకి మంచి లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత `ఆనందం`, `సంతోం`, `వెంకీ`, `అందరివాడు`, `ఢీ`, `దుబాయ్ శీను`, `రెడీ`, `కింగ్`, `నమో వెంకటేశా`, `దూకుడు` వంటి చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలకు శ్రీనువైట్ల కేరాఫ్గా నిలిచారు. దాదాపు అందరు స్టార్స్ తోనూ సినిమాలు చేసి మెప్పించారు. కానీ ఇప్పుడు శ్రీనువైట్ల కూడా దర్శకుడిగా డౌన్లో ఉన్నారు.