Priyanka Chopra: `వారణాసి` మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్లిన ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియా మూవీ చేస్తోంది. అదే `వారణాసి`. ఇదే మూవీతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మరో వైపు తన బిజీ షెడ్యూల్లో మరో పెద్ద ప్రాజెక్ట్ను సొంతం చేసుకుంది. ఫిల్మ్మేకర్ మీరా నాయర్ ఎంతో ప్రస్టీజియస్గా తీస్తున్న 'అమ్రి' సినిమాలో ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో ప్రాజెక్ట్పై అంచనాలు పెరిగాయి.
26
'అమ్రి'లో ప్రియాంకది గెస్ట్ రోల్ కాదు, పవర్ఫుల్ రోల్!
రిపోర్ట్స్ ప్రకారం, 'అమ్రి'లో ప్రియాంక చోప్రా పాత్ర నిడివి తక్కువే అయినా కథలో చాలా కీలకం. 'ఈ సినిమా పెయింటర్ జీవితాన్ని హంగరీ, ఇండియా, ఫ్రాన్స్లలో చూపిస్తుంది. ఈ ప్రత్యేక పాత్ర కోసం మీరా గత ఏడాది ప్రియాంకను సంప్రదించారు. ఆమె ఇటీవల దీని షూటింగ్ పూర్తి చేసింది' అని మిడ్-డే రిపోర్ట్ పేర్కొంది.
36
హైదరాబాద్ నుంచి అమృత్సర్
ప్రియాంక చోప్రా తన బిజీ షెడ్యూల్లో కూడా 'అమ్రి' కోసం సమయం కేటాయించింది. ఆమె మొదట 'వారణాసి' షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉంది. అక్కడి నుంచి నేరుగా అమృత్సర్ వెళ్లి రెండు రోజుల్లో 'అమ్రి'లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసింది.
ఈ సినిమా ప్రముఖ పెయింటర్ అమృతా షేర్-గిల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆమె కథ హంగరీ, ఫ్రాన్స్, భారతదేశం చుట్టూ తిరుగుతుంది. ఫారెన్ ఆర్ట్ కి, భారతీయ ఇతివృత్తాలను కలిపి ఆమె ఒక కొత్త గుర్తింపు తెచ్చుకుంది. మోడ్రన్ భారతీయ కళకు కొత్త దిశ చూపింది.
56
అమృతా షేర్-గిల్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు?
ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాన్యా మానిక్తలా ఈ పాత్రలో కనిపించవచ్చని సమాచారం. ఇదే నిజమైతే, మీరా నాయర్తో ఆమెకు ఇది రెండో ప్రాజెక్ట్ అవుతుంది.
66
ప్రియాంక రాబోయే భారీ సినిమా
'అమ్రి'తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్న 'వారణాసి' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మహేష్కి జోడీగా చేస్తుంది. ఇటీవలే వీరిద్దరిపై ఓ పాటని కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.