క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?

Published : Mar 11, 2026, 08:08 AM IST

ప్రభాస్-పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' విడుదలై నాలుగేళ్లు పూర్తయింది. ఈ సినిమా 2022 మార్చి 11న రిలీజైంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన సాధించింది.  ఆడియన్స్ మాత్రం ఈ సినిమాపై పెదవి విరిచారు. 

PREV
16
రాధే శ్యామ్ రిలీజ్ అయ్యి 4 ఏళ్లు..

పాన్ ఇండిచా  స్టార్ హీరో  ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' 2022లో విడుదలైంది. రిలీజ్‌కు ముందు మార్కెట్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈసినిమా  అనుకున్న అంచనాలను  మాత్రం  అందుకోలేకపోయింది. కథలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాని ప్రేమికుల మనసుల్లో మాత్రం అద్భుతమైన దృశ్య కావ్యంగా మిగిలిపోయింది. 

26
కరోనా కారణంగా ఆగిపోయిన రిలీజ్..

 కేకే రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్ చేసిన 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ చాలాసార్లు వాయిదా పడింది. ఈ సైన్స్-ఫిక్షన్ పీరియడ్ డ్రామాను నిజానికి 2021లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది.

36
వీఎఫ్ఎక్స్ కోసం 60 కోట్లు

ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా వీఎఫ్ఎక్స్ కోసం దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా అత్యంత అధునాతన వీఎఫ్ఎక్స్ ఈ చిత్రంలో వాడారని ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్, ఇటలీ, జార్జియాలలో జరిపారు.

46
బాహుబలి షూటింగ్‌లో ఉండగా..

ప్రభాస్ 'బాహుబలి' షూటింగ్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ ఈ కథను ఆయనకు వినిపించారట. కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఓకే చెప్పారు. మొదట ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి, రాధాకృష్ణ కుమార్‌తో కలిసి రాయడం ప్రారంభించారు. కానీ, చాలా ఏళ్లయినా చంద్రశేఖర్ క్లైమాక్స్ రాయలేకపోవడంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ 18 ఏళ్లు కష్టపడి ఈ సినిమా క్లైమాక్స్‌ను రాశారు.

56
జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్..

'రాధే శ్యామ్'లో ప్రభాస్ జ్యోతిష్యుడి పాత్ర పోషించారు. ఈ క్యారెక్టర్‌కు యూరప్‌కు చెందిన నిజమైన హస్తసాముద్రికుడు కీరో (Cheiro) స్ఫూర్తి అని డైరెక్టర్ వెల్లడించారు. ఇక పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా నటించింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సత్యరాజ్, కృష్ణంరాజు, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శిని, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ కూడా నటించారు.

66
రాధే శ్యామ్ బాక్సాఫీస్ వసూళ్లు..?

'రాధే శ్యామ్' సినిమాను రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం రూ.140 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. వంశీ-ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories